త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP MP Tejasvi Surya | రేవంత్ మోడల్.. ఫూలిష్ ప్రపోజల్

BJP MP Tejasvi Surya | హైబ్రిడ్ మోడల్ ఓ ఫూలిష్ ఆర్గ్యుమెంట్. రాజ్యాంగ విలువలను తిరస్కరించినట్టే. ధనికులకు ఓటు విలువ ఎక్కువ. పేదల ఓటు విలువ తక్కువ. ఆ లెక్కన చూస్తే ముకేశ్ అంబానీకి విలువ లక్ష ఓట్లవుతుంది. పేదవాడి ఓటు విలువ ఒకటవుతుంది అని బీజేపీ ఎంపీ తేజ‌స్వీ సూర్య పేర్కొన్నారు.

S

National | Published On Apr 16, 2026, 7.00 pm IST

BJP MP Tejasvi Surya | రేవంత్ మోడల్.. ఫూలిష్ ప్రపోజల్
Advertisement

ఆయన ప్రతిపాదన హాస్యాస్పదం
ధనికులకు ఓటు విలువ ఎక్కువ
పేదల ఓటు విలువ తక్కువ ఉంటుందా
ఇదేం ప్రతిపాదన?
పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఫైర్

BJP MP Tejasvi Surya | త్రినేత్ర.న్యూస్ : హైబ్రిడ్ మోడల్ ఓ ఫూలిష్ ఆర్గ్యుమెంట్. రాజ్యాంగ విలువలను తిరస్కరించినట్టే. ధనికులకు ఓటు విలువ ఎక్కువ. పేదల ఓటు విలువ తక్కువ. ఆ లెక్కన చూస్తే ముకేశ్ అంబానీకి విలువ లక్ష ఓట్లవుతుంది. పేదవాడి ఓటు విలువ ఒకటవుతుంది. జీఎస్డీపీతో ముడిపెట్టి డీలిమిటేషన్ చేస్తే రాజ్యాంగ విలువలను తిరస్కరించినట్టే. ఏ రాష్ట్ర జీఎస్డీపీ స్థిరంగా ఉండదు. ప్రతి సంవత్సరం మారొచ్చు. ఒక వేళ జీఎస్డీపీతో లింక్ చేశామనుకుందాం. వచ్చే ఏడాది వర్షాలు లేక జీఎస్డీపీ పడిపోతే 2 సీట్లు తగ్గిస్తారా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆయన చెప్పిన హైబ్రిడ్ మోడల్.. ఓ పూలిష్ ప్రపోజల్... అని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ధ్వజమెత్తారు. మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై గురువారం ప్రారంభమైన చర్చపై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా విమర్శించారు. దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభలో ప్రస్తుతం 23.7 శాతం మంది సభ్యులు ఉన్నారని డీలిమిటేషన్ లో భాగంగా 50 శాతం సీట్లు పెరిగితే.. అప్పుడు కూడా ప్రాతినిధ్యం 23.7 శాతానికి తగ్గదని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ తప్పనిసరని కానీ ప్రతిపక్షాలు ఈ విషయంలో దక్షిణాది ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని చెప్పారు.

Advertisement
Advertisement