త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengal ED Raids Row | కోల్‌క‌తా హైకోర్టులో టీఎంసీకి షాక్‌.. పిటిష‌న్‌ను కొట్టేసిన ధ‌ర్మాస‌నం

Bengal ED Raids Row | ప‌శ్చిమ బెంగాల్ ఈడీ దాడులపై న‌మోదైన కేసుల‌ను క‌ల‌క‌త్తా హైకోర్టు బుధ‌వారం విచారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి.

P

National | Published On Jan 14, 2026, 7.27 pm IST

Bengal ED Raids Row | కోల్‌క‌తా హైకోర్టులో టీఎంసీకి షాక్‌.. పిటిష‌న్‌ను కొట్టేసిన ధ‌ర్మాస‌నం
Advertisement

Bengal ED Raids Row | ప‌శ్చిమ బెంగాల్ ఈడీ దాడులపై న‌మోదైన కేసుల‌ను క‌ల‌క‌త్తా హైకోర్టు బుధ‌వారం విచారించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ సందర్భంగా టీఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. గత వారం (జనవరి 8) దాడుల సమయంలో ఐ ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ కార్యాలయం, ఇంటి నుంచి తాము ఏమీ స్వాధీనం చేసుకోలేదని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపిన‌ట్లుగా కోర్టు పేర్కొంది. రెండుచోట్ల ఈడీ దాడుల స‌మ‌యంలో స్వాధీనం చేసుకున్న వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ‌ప‌ర‌మైన డేటాను భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని కోరుతూ టీఎంసీ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

ఈడీ త‌ర‌ఫున అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఎస్‌వీ రాజు హాజ‌రై.. తాము ఎక్క‌డా ఎలాంటి డేటాను స్వాధీనం చేసుకోలేద‌ని కోర్టుకు వెల్ల‌డించారు. జస్టిస్ సువ్రా ఘోష్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ టీఎంసీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఇంకా ప‌రిగ‌ణ‌లోకి తీసుకునేందుకు ఏమీ లేద‌ని వ్యాఖ్యానించారు. జనవరి 8న సోదాల సమయంలో సాల్ట్ లేక్‌లోని రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ కార్యాలయాన్ని, దక్షిణ కోల్‌కతాలోని లౌడాన్ స్ట్రీట్‌లోని సంస్థ డైరెక్టర్ నివాసాన్ని ముఖ్యమంత్రి సంద‌ర్శించారు. మమతా బెనర్జీ దర్యాప్తును అడ్డుకున్నారని ఆరోపిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఘోష్ వాయిదా వేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement