త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AAP MPs join BJP | ఏడుగురు ఆప్ ఎంపీలకు బీజేపీ స్వాగతం.. ‘తుక్డే తుక్డే’ కూటమికి గుడ్‌బై అంటూ కిరెన్ రిజిజు సెటైర్లు

ఆప్‌కు భారీ షాక్. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీలు అధికారికంగా బీజేపీలో చేరారు. వీరి చేరికను కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు స్వాగతిస్తూ ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు.

J

National | Published On Apr 27, 2026, 4.05 pm IST

AAP MPs join BJP | ఏడుగురు ఆప్ ఎంపీలకు బీజేపీ స్వాగతం.. ‘తుక్డే తుక్డే’ కూటమికి గుడ్‌బై అంటూ కిరెన్ రిజిజు సెటైర్లు

సంక్షిప్త సారాంశం

రాఘవ్ చద్దా, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్ సహా మొత్తం ఏడుగురు ఆప్ ఎంపీల విలీనాన్ని రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. దీంతో వీరంతా అధికారికంగా బీజేపీ ఎంపీలు అయ్యారు. వీరిని స్వాగతిస్తూ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు 'తుక్డే తుక్డే' ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఇది తమకు చేసిన ద్రోహం అని ఆప్ మండిపడుతోంది.

Advertisement

AAP MPs join BJP | త్రినేత్ర.న్యూస్ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు అధికారికంగా భారతీయ జనతా పార్టీ గూటికి చేరారు. రాఘవ్ చద్దా సహా ఏడుగురు ఎంపీల విలీన అభ్యర్థనను రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారని, దీంతో పెద్దల సభలో బీజేపీ బలం మరో ఏడు స్థానాలకు పెరిగిందని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు.

బీజేపీలో చేరిన ఆప్ ఎంపీలు వీరే..

రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజిందర్ గుప్తా, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ తదితరులు అధికారికంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సభ్యులయ్యారు. ఈ పరిణామంతో ఆప్ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.

ఆ ఎంపీలపై రిజిజు ప్రశంసలు.. విపక్షాలపై సెటైర్లు

కొత్త ఎంపీలను పార్టీలోకి స్వాగతిస్తూ కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఎక్స్‌ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఈ ఏడుగురు గౌరవనీయ ఎంపీలను నేను చాలా కాలంగా గమనిస్తున్నాను. వీరు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదు, అలాగే సభలో ఎలాంటి క్రమశిక్షణా రాహిత్యానికి, అన్‌-పార్లమెంటరీ ప్రవర్తనకు పాల్పడలేదు," అని ఆయన ప్రశంసించారు.

అలాగే ప్రతిపక్ష ఇండియా కూటమిపై తనదైన శైలిలో చురకలు అంటించారు. "ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ఎన్డీయేలోకి స్వాగతం. అలాగే తుక్డే-తుక్డే ఇండియా కూటమికి గుడ్‌బై," అని రిజిజు పేర్కొన్నారు.

అది ద్రోహమే అన్న ఆప్.. అనర్హత వేటుకు డిమాండ్

మరోవైపు, తమ ఎంపీలు పార్టీ మారడంపై ఆప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రాఘవ్ చద్దా చేసిన ఈ పనిని 'ద్రోహం'గా అభివర్ణించింది. పార్టీని విలీనం చేయడానికి అవసరమైన మూడింట రెండొంతుల మంది సభ్యుల మద్దతు చద్దాకు లేదని, కాబట్టి ఫిరాయింపులకు పాల్పడిన ఈ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతామని ఆప్ స్పష్టం చేసింది.

విపక్షాలది మోసపూరిత కూటమి: రిజిజు

ప్రతిపక్షాలపై తన దాడిని కొనసాగించిన రిజిజు.. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్‌ల మధ్య ఉన్న వైరుధ్యాలను ఎత్తిచూపారు. రాహుల్ గాంధీ గతంలో కేజ్రీవాల్, టీఎంసీలను విమర్శించిన పాత వీడియోలను షేర్ చేశారు. "వీరంతా పార్లమెంటు లోపల ప్రాణమిత్రులుగా ఉంటారు. మహిళల హక్కులను (మహిళా రిజర్వేషన్ బిల్లు) అడ్డుకోవడంలో వీరంతా ఏకమయ్యారు. ఇండియా కూటమి మొదటి నుంచీ ఒక మోసం," అని రిజిజు తీవ్ర విమర్శలు చేశారు. బెంగాల్ ఎన్నికల్లో ఈ పార్టీలు విడిగా పోటీ చేస్తున్నా, జాతీయ స్థాయిలో మాత్రం ఒక పెద్ద ప్రతిపక్ష కూటమిగా ఏర్పడటాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement