త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Fishermen | కేర‌ళ‌లో 469 మంది జాల‌ర్లు మృతి

Kerala Fishermen | కేర‌ళ‌లో చోటు చేసుకున్న సముద్ర ప్ర‌మాదాలు వంద‌లాది మంది జాల‌ర్ల కుటుంబాల్లో చీక‌ట్లు నింపాయి. గ‌త 11 ఏళ్ల‌లో జ‌రిగిన ప్ర‌మాదాల కారణంగా 469 మంది జాల‌ర్లు చనిపోయిన‌ట్లు కేర‌ళ మ‌త్స్య‌శాఖ మంత్రిత్వ కార్యాల‌యం శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది.

S

National | Published On Aug 7, 2026, 3.31 pm IST

Kerala Fishermen | కేర‌ళ‌లో 469 మంది జాల‌ర్లు మృతి
Advertisement

Kerala Fishermen | త్రినేత్ర‌.న్యూస్ : కేర‌ళ‌లో చోటు చేసుకున్న సముద్ర ప్ర‌మాదాలు వంద‌లాది మంది జాల‌ర్ల కుటుంబాల్లో చీక‌ట్లు నింపాయి. గ‌త 11 ఏళ్ల‌లో జ‌రిగిన ప్ర‌మాదాల కారణంగా 469 మంది జాల‌ర్లు చనిపోయిన‌ట్లు కేర‌ళ మ‌త్స్య‌శాఖ మంత్రిత్వ కార్యాల‌యం శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇద్ద‌రు మ‌త్స్య‌కారులు ఇటీవ‌ల కాలంలో అదృశ్యం కావ‌డంతో.. జాల‌ర్ల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో మ‌త్స్య శాఖ జాల‌ర్ల మృతుల‌కు సంబంధించి కీల‌క‌ ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

11 ఏళ్ల‌ల్లో 469 మంది జాల‌ర్లు మృతి చెంద‌గా, మ‌రో 160 మంది గ‌ల్లంత‌య్యార‌ని మ‌త్స్య‌శాఖ మంత్రి వీఈ అబ్దుల్ గ‌ఫూర్ కార్యాల‌యం వెల్ల‌డించింది. కేరళ సముద్ర మత్స్య నియంత్రణ (KMFR) చట్టం అమలులో భాగంగా 2015-16 నుండి 2025-26 వరకు 23,000 పెట్రోలింగ్ ఆప‌రేష‌న్లు, 5,072 సముద్ర రక్షణ కార్యకలాపాలు నిర్వహించిన‌ట్లు తెలిపింది. ఇక 11 ఏళ్లల్లో 47,773 జాల‌ర్లను ర‌క్షించామ‌ని వెల్ల‌డించింది. 2017-18లో అత్య‌ధికంగా 79 మంది జాల‌ర్లు మ‌ర‌ణించ‌గా, 2025-26లో 55 మంది, 2023-24లో 54 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు మ‌త్స్య‌శాఖ స్ప‌ష్టం చేసింది.

Advertisement
Advertisement