త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cocaine | ముంబైలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్ ప‌ట్టివేత‌

Cocaine | మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ ముఠా నుంచి 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు.

S

National | Published On May 1, 2026, 4.02 pm IST

Cocaine | ముంబైలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్ ప‌ట్టివేత‌
Advertisement

Cocaine | త్రినేత్ర‌.న్యూస్ : మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో రూ. 1745 కోట్ల విలువ చేసే కొకైన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సీజ్ చేశారు. అంత‌ర్జాతీయ డ్ర‌గ్స్ ముఠా నుంచి 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ మేర‌కు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈ విష‌యాన్ని ఎక్స్ ద్వారా వెల్ల‌డిస్తూ.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారుల‌ను అభినందించారు.

డ్ర‌గ్స్ ర‌వాణాకు పాల్ప‌డే ముఠాల‌ను ఉక్కుపాదంతో అణచివేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ముంబై న‌గ‌రంలో రూ. 1745 కోట్ల విలువ చేసే 349 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఒక చిన్న స‌రుకును గుర్తించి.. దాన్నుంచి ఒక భారీ నెట్‌వ‌ర్క్‌ను ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. కాగా.. ఆప‌రేష‌న్ గ్లోబ‌ల్ హంట్‌లో భాగంగా అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు సలీమ్‌ డోలాను ఇటీవల ట‌ర్కీ నుంచి ఇండియాకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో స‌లీమ్ డోలాను ఎన్సీబీ అధికారులు క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకోవడం గమనార్హం.

Advertisement
Advertisement