త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak | ఫిబ్రవరి 11లోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు నిన్ను చీల్చి చెండాడుతారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గెలిచే దమ్ములేకనే బీఆర్ఎస్ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని మండిపడ్డారు. "11వ తేదీలోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు నిన్ను చీల్చి చెండాడుతారు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

J

Medak | Published On Feb 4, 2026, 10.00 pm IST

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak | ఫిబ్రవరి 11లోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు నిన్ను చీల్చి చెండాడుతారు

సంక్షిప్త సారాంశం

మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డి భాషపై మండిపడ్డారు. ఫిబ్రవరి 11లోగా రైతుబంధు ఇవ్వకపోతే రైతులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. "కేసీఆర్ తెలంగాణ తెస్తేనే నువ్వు సీఎం అయ్యావు.. లేకపోతే ఆంధ్రాలో బ్యాగులు మోసేవాడివి" అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని, భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు.

Advertisement
  • "నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా?"
  • రేవంత్ రెడ్డిపై హరీష్ రావు నిప్పులు

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak | త్రినేత్ర.న్యూస్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే భాష, పాలన తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు.

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak

"ముఖ్యమంత్రికి ఉండాల్సిన భాష ఇదేనా?"

రేవంత్ రెడ్డిని ఉద్దేశించి హరీష్ రావు మాట్లాడుతూ.. "నువ్వు ఒక ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అని అడుగుతున్నా. పెన్షన్ అడిగిన అవ్వతాతలను, మహాలక్ష్మి డబ్బులు అడిగిన ఆడబిడ్డలను 'లాగుల తొండలు వదులుతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా' అని బెదిరిస్తావా? ఇదేనా నీ సంస్కారం? నీ రౌడీయిజం ఇక్కడ సాగదు ఖబర్దార్" అని హెచ్చరించారు.

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak

"కేసీఆర్ భిక్షే నీ సీఎం కుర్చీ"

తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన త్యాగాలను గుర్తుచేస్తూ.. "కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, కేంద్ర మంత్రి వంటి పదవులను గడ్డిపోచల్లా విసిరేసి తెలంగాణ తెచ్చారు. కేసీఆర్ తెచ్చిన తెలంగాణ వల్లే నువ్వు ఈరోజు సీఎం కుర్చీలో కూర్చున్నావు. లేకపోతే ఆంధ్రాలో మోచేతి నీళ్లు తాగుతూ, బ్యాగులు మోసుకుంటూ బతికేవాడివి," అని ఎద్దేవా చేశారు. పీసీసీ పదవిని 50 కోట్లకు కొనుక్కున్న చరిత్ర రేవంత్ రెడ్డిదని ఆరోపించారు.

రైతుబంధుపై డెడ్‌లైన్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. "బాండ్ పేపర్లు రాసిచ్చి, దేవుళ్ల మీద ఒట్టేసి రుణమాఫీ పేరుతో మోసం చేశావు. ఫిబ్రవరి 11వ తేదీలోగా రైతుబంధు రైతుల ఖాతాల్లో పడకపోతే, రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తారు. నిన్ను చీల్చి చెండాడుతారు," అని హెచ్చరించారు.

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak

"గెలిచే దమ్ములేక కిడ్నాప్ రాజకీయాలు"

మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రలోభపెడుతోందని విమర్శించారు. "గెలిచే సత్తా లేక మా అభ్యర్థులను ఎత్తుకెళ్తున్నారు. పోలీసులతో బెదిరించి కండువాలు కప్పుతున్నారు. ఎవరెవరు ఏం చేస్తున్నారో అంతా గమనిస్తున్నాం. సమయం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తాం," అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Harish Rao Lashes Out at Revanth Reddy in Medak

కార్యకర్తలకు భరోసా

మెదక్ జిల్లా అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందని, ఇక్కడికి రైలు, కలెక్టర్ ఆఫీసు తెచ్చింది తామేనని హరీష్ రావు గుర్తుచేశారు. ఏ కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా తాను అండగా ఉంటానని, భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. మెదక్ అభివృద్ధి కొనసాగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రజలను కోరారు.

Advertisement

తాజావార్తలు

Advertisement