Heart Diseases | యువతలో పెరిగిపోతున్న గుండె జబ్బులు.. ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు..
Heart Diseases | నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు.. అనేక మంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. మద్యం సేవించవద్దని, పొగ తాగవద్దని, చెడు వ్యసనాల జోలికి పోవొద్దని, వ్యాయామం చేయాలని, మంచి జాబ్ సాధించాలని, బరువు తగ్గాలని.. ఇలా రకరకాల తీర్మానాలు చేసుకుంటారు.
Heart Diseases | నూతన సంవత్సరం వచ్చిందంటే చాలు.. అనేక మంది చాలా తీర్మానాలు చేసుకుంటారు. మద్యం సేవించవద్దని, పొగ తాగవద్దని, చెడు వ్యసనాల జోలికి పోవొద్దని, వ్యాయామం చేయాలని, మంచి జాబ్ సాధించాలని, బరువు తగ్గాలని.. ఇలా రకరకాల తీర్మానాలు చేసుకుంటారు. కానీ అధిక శాతం మంది ఆ తీర్మానాలను పాటించడంలో విఫలం అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే 2025లో ఆరోగ్యం పట్ల చాలా మంది చేసుకున్న తీర్మానాలు ఫలించాయా, లేదా అన్న విషయంపై నానక్రాంగూడలోని స్టార్ హాస్పిటల్స్లో వైద్యుల ఆధ్వర్యంలో ది 2025 రియాలిటీ చెక్ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో హాస్పిటల్లోని పలు విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొన్నారు. 2025లో అధిక శాతం మంది ఆరోగ్యం పట్ల చేసుకున్న తీర్మానాలు విజయవంతం అయ్యాయా, లేదా అన్న విషయంపై వారు ప్రసంగించారు.
నివారణ, ముందస్తు గుర్తింపు ముఖ్యం..
ఈ సమావేశంలో హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్ మన్నం, సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ హెడ్ డాక్టర్ సాయినాథ్ బేతనభట్ల, సర్జికల గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ భరత్ కుమార్ నారా, గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ వై.రామిరెడ్డి, నెఫ్రాలజీ, ట్రాన్స్ప్లాంట్ డాక్టర్ గాంధే శ్రీధర్, క్లినికల్, ట్రాన్స్ప్లాంట్ హెపటాలజీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి.జి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ డాక్టర్ శ్రీకాంత్ యెర్రం, ఎండోక్రినాలజీ డాక్టర్ రోహిణి కస్తూరి, న్యూరాలజీ డాక్టర్ బి.సంతోష్ కుమార్ పాల్గొని ది 2025 రియాలిటీ చెక్ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపీచంద్ మన్నం మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణ అనేది నేడు కేవలం ఆసుపత్రి గోడలకే పరిమితం కాకూడదని, వ్యాధి భారాన్ని తగ్గించాలనే విషయంలో మనం సీరియస్గా ఉంటే, నివారణ, ముందస్తు గుర్తింపు అనేవి అనారోగ్యానికి ప్రతిస్పందనగా కాకుండా, దైనందిన జీవితంలో భాగం కావాలని అన్నారు. తాము ప్రతిరోజూ ఎన్నో వ్యాధులకు చికిత్స చేస్తామని, కానీ నివారించగలిగే సమస్యల కోసం ప్రజలు ఆసుపత్రికి రాకుండా చూడడమే తమ నిజమైన బాధ్యత అని పేర్కొన్నారు.
ఆందోళన కలిగిస్తున్న గుండె జబ్బులు..
సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ ఆంకాలజీ హెడ్ డాక్టర్ సాయినాథ్ బేతనభట్ల మాట్లాడుతూ ప్రతి జనవరిలో మనం ఆరోగ్య తీర్మానాల గురించి వింటాం కానీ 2025లో తమ ఓపీడీలలో చూసిన పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. నివారించదగిన లేదా ముందుగానే గుర్తించదగిన సమస్యలతో చాలా మంది రోగులు తమ దగ్గరకు వచ్చారని అన్నారు. ఈ అంతరాన్ని నిజాయితీగా ఎదుర్కోవడమే ఈ 2025 రియాలిటీ చెక్ ఉద్దేశం అని అన్నారు. డాక్టర్ శ్రీకాంత్ యెర్రం మాట్లాడుతూ కేవలం గుండె కేసుల సంఖ్యే కాదు, రోగుల వయస్సు కూడా ఆందోళన కలిగిస్తోందని, 30లలో, 20ల చివరలో ఉన్నవారు కూడా తీవ్రమైన గుండె జబ్బులతో వస్తున్నారని, వీరు రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ వంటి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకోవడం లేదని, అందుకనే ఆ వయస్సులో ఉన్నవారికి కూడా గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వృద్ధులకు మాత్రమే పరిమితం కాదు..
డాక్టర్ రోహిణి కస్తూరి మాట్లాడుతూ జీవనశైలి రుగ్మతలు ఇకపై వృద్ధులకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. మధుమేహం, ఊబకాయం ఇప్పుడు వృద్ధాప్య సమస్యలు మాత్రమే కాదని, 2025లో యువ ఉద్యోగులు, విద్యార్థులు కూడా ఈ సమస్యలతో బాధపడటం తాము చూశామని తెలిపారు. వీటిని ముందుగానే గుర్తించి పరిష్కరించాలని అన్నారు. కాగా 2026 సంవత్సరాన్ని స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హీలింగ్ ఇయర్గా ప్రకటిస్తున్నామని, అత్యవసర చికిత్స నుండి నివారణ, ముందస్తు రోగ నిర్ధారణ, నిరంతర కమ్యూనిటీ అవగాహన వైపు దృష్టి సారించడమే దీని లక్ష్యమని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. 2026ను ఇయర్ ఆఫ్ హీలింగ్ గా ప్రకటించడం ద్వారా, కుటుంబాల్లో నివారించదగిన వ్యాధిని తగ్గించే అవగాహన, ముందస్తు స్క్రీనింగ్, నివారణకు భవిష్యత్తు కోసం తమ హాస్పిటల్స్ కట్టుబడి ఉన్నాయని తెలిపారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



