Sanmar Herald Distress Audio | “మీరే అనుమతి ఇచ్చారు కదా!”: హార్ముజ్ జలసంధిలో భారతీయ నౌకపై ఇరాన్ కాల్పులు.. ఆడియో లీక్
హార్ముజ్ జలసంధిలో రెండు భారతీయ ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ సాయుధ దళాలు కాల్పులకు దిగాయి. ఈ దాడికి గురైన 'సన్మార్ హెరాల్డ్' నౌక సిబ్బంది పంపిన ఆడియో సందేశం తాజాగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరాన్ రాయబారికి సమన్లు జారీ చేసింది.
International | Published On Apr 19, 2026, 5.44 pm IST
Sanmar Herald Distress Audio | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం నడుమ, శనివారం రెండు భారతీయ జెండాలతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్లపై ఇరాన్ సాయుధ పడవలు (Gunboats) కాల్పులకు తెగబడ్డాయి. దీంతో ఆ నౌకలు వెనక్కి మళ్లాయి. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, నౌకలకు కూడా ఎలాంటి డ్యామేజ్ కాలేదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లీకైన డిస్ట్రెస్ ఆడియో.. సిబ్బంది ఏమన్నారంటే?
ఈ కాల్పుల సమయంలో నెలకొన్న గందరగోళాన్ని కళ్లకు కట్టేలా ఒక నౌకకు చెందిన డిస్ట్రెస్ ఆడియో (ఆపద సమయంలో పంపే సందేశం) ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. షిప్మెంట్లను ట్రాక్ చేసే మారిటైమ్ ఇంటెలిజెన్స్ సంస్థ 'ట్యాంకర్ ట్రాకర్స్' (Tanker Trackers).. 'సన్మార్ హెరాల్డ్' (Sanmar Herald) అనే క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లోని సిబ్బంది ఇరాన్ నావీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించిన సుమారు 30 సెకన్ల ఆడియోను షేర్ చేసింది.
"సెపాహ్ నేవీ (Sepah Navy).. ఇది మోటార్ ట్యాంకర్ సన్మార్ హెరాల్డ్. వెళ్లడానికి మీరే నాకు క్లియరెన్స్ (అనుమతి) ఇచ్చారు. మీ లిస్ట్లో నా పేరు రెండో స్థానంలో ఉంది. కానీ, ఇప్పుడు మీరే కాల్పులు జరుపుతున్నారు. దయచేసి నన్ను వెనక్కి వెళ్లనివ్వండి" అని ఆ నౌకలోని సిబ్బంది ఆందోళనగా చెప్పడం ఆడియోలో రికార్డ్ అయ్యింది.
నౌక 'గ్రీన్ ఏరియా'లోనే ఉన్నప్పటికీ ఈ ఘటన జరిగిందని అమెరికన్ బ్రాడ్కాస్టర్ ఎన్బీసీ నివేదించింది. తూర్పు వైపు వెళుతున్నప్పుడు ట్యాంకర్ తన ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను ఆఫ్ చేసిందని, ఆ తర్వాత తూర్పు వైపున తిరిగి ఆన్ చేసిందని తెలిపింది. కాల్పులకు గురైన మరో నౌకను 'జగ్ అర్నవ్'గా గుర్తించారు.

ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
ఈ కాల్పుల ఘటనను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబారిని పిలిపించిన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. భారతీయ నౌకలపై జరిగిన కాల్పుల పట్ల "తీవ్ర ఆందోళన" వ్యక్తం చేసింది.
"వ్యాపార నౌకలు, నావికుల భద్రతకు భారత్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. గతంలో భారతదేశానికి వచ్చే పలు నౌకలకు ఇరాన్ సురక్షిత మార్గాన్ని సులభతరం చేసిందన్న విషయాన్ని విదేశాంగ కార్యదర్శి గుర్తుచేశారు. ఈ తాజా కాల్పుల ఘటనపై ఇరాన్ అధికారులకు మా ఆందోళనలను తెలియజేయాలని రాయబారిని కోరాము," అని ఎంఈఏ తెలిపింది. భారత ప్రభుత్వం చెప్పిన అంశాలను ఇరాన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని రాయబారి హామీ ఇచ్చారు.
హార్ముజ్ జలసంధిలో గందరగోళం
ప్రస్తుత యుద్ధ పరిస్థితుల కారణంగా హార్ముజ్ జలసంధి వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ - హిజ్బుల్లా యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణకు అంగీకరించిన తర్వాత, జలసంధిని తెరుస్తామని ఇరాన్ గతంలో ప్రకటించింది. కానీ, అమెరికా దిగ్బంధనం కాల్పుల విరమణ ఉల్లంఘనే అని పేర్కొంటూ ఇరాన్ శనివారం తన నిర్ణయాన్ని మార్చుకుంది. జలసంధి నియంత్రణ పూర్తిగా తమ సాయుధ దళాల చేతుల్లోకి వెళ్లిందని జాయింట్ మిలిటరీ కమాండ్ ప్రకటించింది.
హార్ముజ్ జలసంధిని సమీపిస్తే శత్రువులకు సహకరిస్తున్నట్లుగానే పరిగణిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ గార్డ్స్ 'తస్నిమ్' న్యూస్ ఏజెన్సీ ద్వారా హెచ్చరించారు. అయితే, వారం రోజుల క్రితం ఇరాన్ రాయబారి మొహమ్మద్ ఫతాలి మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ నౌకల కోసం జలసంధి తెరిచే ఉంటుందని హామీ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఇరాన్ తీసుకుంటున్న అకస్మాత్తు నిర్ణయాలతో వాణిజ్య నౌకల రాకపోకలపై తీవ్ర సందిగ్ధత నెలకొంది.
NEW: Audio from the Indian oil tanker fired on by Iranian Navy in the Strait of Hormuz
“You gave me clearance to go. My name is second on your list. You are firing now. Let me turn back!” pic.twitter.com/C3nouIPzOJ
— Insider Paper (@TheInsiderPaper) April 18, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Iran Peace Memo | అమెరికా-ఇరాన్ యుద్ధానికి ముగింపు? ‘వన్-పేజీ’ ఒప్పందంతో శాంతి చర్చలకు మార్గం
మే 6, 2026

Strait of Hormuz | ఇరాన్ కొత్త ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: హార్ముజ్ జలసంధి ఓపెనింగ్పై వీడని సస్పెన్స్
మే 2, 2026

Iran US conflict | హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ఇరాన్ 3 కండిషన్లు.. ట్రంప్ ఒప్పుకుంటారా?
ఏప్రిల్ 28, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



