త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US Air Force Iran strike | ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ సైన్యం రెడీ? మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ‘ఎయిర్ బ్రిడ్జ్’.. హై అలర్ట్‌లో ప్రపంచ దేశాలు!

ఇరాన్‌పై దాడులు చేసేందుకు అమెరికా సైన్యం సిద్ధమవుతోందా? మిడిల్ ఈస్ట్‌లో అమెరికా యుద్ధ విమానాల కదలికలు, 'ఎయిర్ బ్రిడ్జ్' నిర్మాణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

J

International | Published On Feb 22, 2026, 8.04 pm IST

US Air Force Iran strike | ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్ సైన్యం రెడీ? మిడిల్ ఈస్ట్‌లో అమెరికా ‘ఎయిర్ బ్రిడ్జ్’.. హై అలర్ట్‌లో ప్రపంచ దేశాలు!
Advertisement

US Air Force Iran strike | త్రినేత్ర.న్యూస్ : మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌పై ఏ క్షణమైనా అమెరికా విరుచుకుపడే అవకాశం ఉందన్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. తాజాగా బహిర్గతమైన ఫ్లైట్‌రాడార్ (Flightradar) డేటా ప్రకారం, అమెరికా వైమానిక దళం (US Air Force) పశ్చిమాసియాలో ఒక భారీ 'ఎయిర్ బ్రిడ్జ్' (వాయు వారధి)ని నిర్మిస్తోంది. ఇది భారీ స్థాయి వైమానిక దాడులకు ముందు చేసే సన్నాహక చర్యగా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఏమిటీ 'ఎయిర్ బ్రిడ్జ్'?

యుద్ధ విమానాలు నిరంతరాయంగా దాడులు చేయాలంటే వాటికి గాలిలోనే ఇంధనం నింపే (Mid-air refueling) సౌకర్యం ఉండాలి. ఫ్లైట్‌రాడార్ డేటా ప్రకారం, డజన్ల కొద్దీ అమెరికన్ KC-135, KC-46 స్ట్రాటో ట్యాంకర్లు అట్లాంటిక్ మీదుగా మిడిల్ ఈస్ట్‌కి చేరుకుంటున్నాయి. జోర్డాన్, ఖతార్, కువైట్, యూఏఈలోని అమెరికా స్థావరాలకు ఈ విమానాలు భారీగా తరలివస్తున్నాయి. ఒక దేశంపై సుదీర్ఘకాలం పాటు వైమానిక దాడులు చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి భారీ స్థాయి ఇంధన విమానాల కదలికలు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్రంప్ 10 రోజుల డెడ్ లైన్

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇరాన్‌కు ఒక కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. అణు ఒప్పందంపై 10 నుంచి 15 రోజుల్లోగా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే "తీవ్ర పరిణామాలు" ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఈ గడువు ముగుస్తున్న తరుణంలోనే, అమెరికాకు చెందిన USS గెరాల్డ్ ఫోర్డ్ యుద్ధ నౌక కూడా మధ్యధరా సముద్రం వైపు వేగంగా దూసుకొస్తోంది.

రంగంలోకి అత్యాధునిక యుద్ధ విమానాలు

కేవలం ఇంధన విమానాలే కాకుండా, అమెరికా తన అమ్ములపొదిలోని శక్తివంతమైన ఆయుధాలను రంగంలోకి దించింది. అందులో F-22 రాప్టర్స్, F-35 స్టీల్త్ ఫైటర్స్ ఉన్నాయి. ఇవి శత్రు దేశాల రాడార్లకు చిక్కకుండా దాడులు చేయగలవు. E-3 సెంట్రీ (AWACS) యుద్ధ క్షేత్రాన్ని పర్యవేక్షించే అత్యాధునిక రాడార్ విమానాలు. U-2 డ్రాగన్ లేడీ అత్యంత ఎత్తులో ప్రయాణించి గూఢచర్యం చేసే నిఘా విమానం.

ప్రపంచ దేశాల ఆందోళన

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ ఇప్పటికే తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు, తమ పౌరులు వెంటనే ఇరాన్ విడిచి రావాలని పోలాండ్ వంటి దేశాలు ఆదేశాలు జారీ చేశాయి. ఒకవేళ అమెరికా దాడులు ప్రారంభిస్తే, అది కేవలం ఒక రోజుతో ముగిసేది కాదని, కనీసం కొన్ని వారాల పాటు కొనసాగే భారీ ఆపరేషన్ అని నివేదికలు సూచిస్తున్నాయి.

ఇరాన్ కూడా దీనికి దీటుగా స్పందిస్తూ హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించింది. ఇదే గనుక జరిగితే ప్రపంచ చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది.

https://x.com/Osinttechnical/status/2025470562840039887

 

Advertisement
Advertisement