త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India US trade deal | రైతుల ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే.. వెనిజులా ఆయిల్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అమెరికాతో కుదిరిన చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంలో భారత రైతుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. వ్యవసాయం, డెయిరీ రంగాలను కాపాడుకుంటూనే, వెనిజులాపై ఆంక్షలు తొలగడంతో అక్కడి నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తామని వెల్లడించాయి.

J

International | Published On Feb 3, 2026, 2.37 pm IST

India US trade deal | రైతుల ప్రయోజనాల విషయంలో తగ్గేదేలే.. వెనిజులా ఆయిల్ కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సంక్షిప్త సారాంశం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ అనంతరం కీలక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. దీని ప్రకారం భారత వస్తువులపై పన్నును 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ ఒప్పందంలో వ్యవసాయం, డెయిరీ రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని, రైతుల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదని భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, వెనిజులాపై ఆంక్షలు లేనందున అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశాయి.

Advertisement
  • అమెరికాతో వాణిజ్య ఒప్పందం
  • రైతుల ప్రయోజనాలకే పెద్దపీట

India US trade deal | అమెరికాతో కుదుర్చుకున్న చరిత్రాత్మక వాణిజ్య ఒప్పందంలో భారత రైతుల ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ఇంధన కొనుగోళ్లు, ముఖ్యంగా వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులు కూడా ఉండవచ్చని తెలిపాయి.

సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ సంభాషణ అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. దీని ప్రకారం, భారతీయ వస్తువులపై ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాలను (Tariffs) 18 శాతానికి తగ్గించేందుకు వాషింగ్టన్ అంగీకరించిందన్నారు.

రైతులకు రక్షణ కవచం

అమెరికాతో మార్కెట్ విస్తరణ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, వ్యవసాయం, డెయిరీ లాంటి సున్నితమైన రంగాలకు పూర్తి రక్షణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఉద్ఘాటించాయి. చర్చల సమయంలో ఈ కీలక రంగాల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ పడలేదని, రైతుల ప్రయోజనాలు ఎప్పటికీ సురక్షితంగా ఉంటాయని భరోసా ఇచ్చాయి. ఈ ఒప్పందం ద్వారా సానుకూల ఆర్థిక వాతావరణం ఏర్పడిందని, ఇది ప్రపంచ వాణిజ్య చర్చల్లో ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వెనిజులా ఆయిల్ కొనుగోలు

మరోవైపు ఇంధన సరఫరాపై స్పందిస్తూ.. అంతర్జాతీయ ఆంక్షలు లేని ఏ దేశం నుంచైనా, మార్కెట్ ధరలకు అనుగుణంగా ముడి చమురును కొనుగోలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. "వెనిజులాపై ఆంక్షలు ఉన్నప్పుడు మేము అక్కడి నుండి కొనుగోలు చేయలేదు. ఇప్పుడు ఆంక్షలు ఎత్తివేసినందున, మేము అక్కడి నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాము" అని అధికారులు పేర్కొన్నారు.

మూడు రోజుల క్రితమే, ఇరాన్ నుంచి కాకుండా భారత్ వెనిజులా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటుందని ప్రెసిడెంట్ ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. "మేము ఇప్పటికే ఒక ఒప్పందం చేసుకున్నాము. భారత్ ఇరాన్ నుండి కాకుండా వెనిజులా ఆయిల్ కొనుగోలు చేయబోతోంది" అని ఆయన విలేకరులతో అన్నారు.

500 బిలియన్ డాలర్ల లక్ష్యం

ఈ ఒప్పందం ద్వారా రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 500 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ ప్రాధాన్యతలను కాపాడుకుంటూనే, అమెరికాతో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో ఇది ఒక భాగమని తెలిపాయి.

Advertisement
Advertisement