త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Toxic Gas Leak | గ‌నిలో విష‌వాయువులు లీకై 37 మంది మృతి

Toxic Gas Leak | పశ్చిమ ఆఫ్రికా దేశ‌మైన నైజీరియా (Nigeria)లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర-మధ్య నైజీరియాలోని ఓ గ‌నిలో విష‌వాయువులు లీకై (Toxic Gas Leak) 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

D

International | Published On Feb 19, 2026, 3.55 pm IST

Toxic Gas Leak | గ‌నిలో విష‌వాయువులు లీకై 37 మంది మృతి
Advertisement

Toxic Gas Leak | పశ్చిమ ఆఫ్రికా దేశ‌మైన నైజీరియా (Nigeria)లో విషాదం చోటు చేసుకుంది. ఉత్తర-మధ్య నైజీరియాలోని ఓ గ‌నిలో విష‌వాయువులు లీకై (Toxic Gas Leak) 37 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 26 మంది ఆసుప‌త్రిపాల‌య్యారు. ఈ ఘ‌ట‌న ప్లాటూ రాష్ట్రంలోని కంపానీ జురాక్ ప్రాంతంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున‌ చోటు చేసుకుంది.

గ‌నిలో కార్మికులు ప‌నుల్లో ఉండ‌గా విషవాయువులు లీక‌య్యాయి. విష‌పూరిత‌మైన స‌ల్ఫ‌ర్‌, కార్బ‌న్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుద‌లైన‌ట్లు అధికారులు తెలిపారు. మైన‌ర్లే ఎక్కువ‌గా ప్ర‌భావిత‌మైన‌ట్లు చెప్పారు. స‌మాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గ‌ని ప్రాంతాన్ని మూసివేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

నైజీరియాలో అక్ర‌మ మైనింగ్ కార్య‌క‌లాపాలు సాధార‌ణ‌మే. ఈ క్ర‌మంలో జ‌రిగే ప్ర‌మాదాల్లో వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, తాజాగా జ‌రిగిన ప్ర‌మాదంలో అక్క‌డ ఎలాంటి త‌వ్వ‌కాలు జ‌రుగుతున్నాయి..? ఆ ప‌నుల‌కు ప్ర‌భుత్వ అనుమ‌తి ఉందా..? లేదా..? వంటి వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని స్థానిక అధికారులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement