త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Madhapur | మాదాపూర్‌లో డీసీఎం బీభత్సం.. స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీట‌ర్లు అలాగే..

Madhapur | హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) డీసీఎం బీభ‌త్సం సృష్టించింది. అర్ధ‌రాత్రి వేళ ఓ స్కూట‌ర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. అలాగే 5 కిలోమీట‌ర్లు ఈడ్చుకెళ్లింది.

G

Hyderabad | Published On Apr 5, 2026, 6.35 am IST

Madhapur | మాదాపూర్‌లో డీసీఎం బీభత్సం.. స్కూటీని ఢీకొట్టి 5 కిలోమీట‌ర్లు అలాగే..
Advertisement

Madhapur | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో (Madhapur) డీసీఎం బీభ‌త్సం సృష్టించింది. అర్ధ‌రాత్రి వేళ ఓ స్కూట‌ర్‌ను ఢీకొట్టిన డీసీఎం.. అలాగే 5 కిలోమీట‌ర్లు ఈడ్చుకెళ్లింది. స్థానికులు దానిని వెంబ‌డించి అడ్డుకోవ‌డంతో డ్రైవ‌ర్ వాహ‌నాన్ని ఆపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఓ మ‌హిళ మ‌ర‌ణించారు.

శనివారం అర్ధరాత్రి మాదాపూర్‌ పరిధిలో మైండ్‌స్పేస్‌ సమీపంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు స్కూటీపై వెళ్తున్నారు. అదే స‌మ‌యంలో వేగంగా దూసుకొచ్చిన‌ డీసీఎం వారి స్కూటీని ఢీకొట్టింది. దీంతో స్కూటీ డీసీఎం కింద ఇరుక్కుపోయినా డ్రైవరు ఆగకుండా జూబ్లీహిల్స్‌ వరకూ అలాగే వెళ్లిపోయాడు. దీనిని గమనించిన కొందరు యువకులు డీసీఎంను వెంటాడి అడ్డుకున్నారు. దీంతో డ్రైవరు పారిపోగా.. సహాయకుడు మాత్రం దొరికాడు. స్థానికులు అత‌డిని చిత‌క‌బాది పోలీసుల‌కు అప్ప‌గించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను ఏఐజీ ద‌వాఖాన‌కు తరలించారు. అయితే అప్ప‌టికే ఒక‌రు మృతిచెందినట్లు డాక్ట‌ర్లు తెలిపారు. మ‌రొక‌రికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement