త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | దొంగా దొంగా వస్తాడే.. అన్నీ దోచుకుపోతాడే..

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఓ దొంగ‌ను జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి విలువైన వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Apr 21, 2026, 7.16 pm IST

Hyderabad | దొంగా దొంగా వస్తాడే.. అన్నీ దోచుకుపోతాడే..

సంక్షిప్త సారాంశం

అతని వ‌య‌సు 24 ఏండ్లే. కానీ గంజాయి, మ‌ద్యానికి బానిస‌గా మారాడు. అంతేకాదు విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటు ప‌డ్డాడు. దీంతో న‌గ‌రంలో అర్ధ‌రాత్రి వేళ చోరీల‌కు పాల్ప‌డుతూ.. ప‌లుమార్లు జైలు పాల‌య్యాడు. తాజాగా చోరీ కేసులో పట్టుబ‌డి మ‌ళ్లీ జైలుకెళ్లాడు.

Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వ‌రుస దొంగ‌త‌నాల‌కు పాల్ప‌డుతున్న ఓ దొంగ‌ను జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద నుంచి విలువైన వ‌స్తువుల‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం కోర్టులో హాజ‌రు ప‌రిచి రిమాండ్‌కు త‌ర‌లించారు.

ఇటీవ‌లే ఆల్విన్ కాల‌నీలో కేటీఎం బైక్, మొబైల్ ఫోన్లు, శుభోద‌య కాల‌నీలో టీవీఎస్ జుపిట‌ర్ స్కూటీని చోరీ చేసిన‌ట్లు కేసు న‌మోదైంది. దీంతో పోలీసులు ద‌ర్యాప్తులో భాగంగా.. సికింద్రాబాద్‌కు చెందిన‌ మ‌హ్మ‌ద్ స‌మీర్‌ఖాన్‌(24)ను అరెస్టు చేసి విచారించ‌గా, చేసిన నేరాన్ని అంగీక‌రించాడు.

నిందితుడు మ‌ద్యం, గంజాయికి బానిస‌గా మారాడు. ఇక విలాస‌వంత‌మైన జీవితానికి డ‌బ్బు కోసం చోరీల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు అంగీక‌రించాడు. మాదాపూర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, బేగంపేట్, అల్లాపూర్ ప్రాంతాల్లో పలుచోట్ల చోరీ కేసుల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించిట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. తాజాగా జ‌గ‌ద్గిరిగుట్ట పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోరీకి పాల్ప‌డి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

నిందితుడి నుంచి శ్యాంసంగ్, ఒప్పో మొబైల్ ఫోన్లు, టీవీఎస్ జుపిట‌ర్, కేటీఎం బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాత్రి స‌మ‌యంలో పార్కు చేసిన వాహ‌నాల‌ను, లాక్ చేసిన ఇండ్ల‌ను టార్గెట్‌గా చేసుకుని చోరీల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు తేలింది.

Advertisement
Advertisement