త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Talasani Srinivas Yadav | ఇంటికొక‌రు ర్యాలీకి త‌ర‌లిరావాలి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav | సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం, ఆత్మ‌గౌర‌వం పోరాటంలో భాగంగానే శాంతిర్యాలీ నిర్వ‌హిస్తున్న మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. ఇంటికొక‌రు చొప్పున ర్యాలీకి త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు.

A

Hyderabad | Published On Jan 16, 2026, 1.43 pm IST

Talasani Srinivas Yadav | ఇంటికొక‌రు ర్యాలీకి త‌ర‌లిరావాలి: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

సికింద్రాబాద్ అస్తిత్వం కోస‌మే పోరాటం, ర్యాలీ జ‌రుగుతుంద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌

Talasani Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: సికింద్రాబాద్ (Secunderabad) అస్తిత్వం, ఆత్మ‌గౌర‌వం పోరాటంలో భాగంగానే శాంతిర్యాలీ నిర్వ‌హిస్తున్న మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ (Talasani Srinivas Yadav) తెలిపారు. శ‌నివారం ఉద‌యం తొమ్మిది గంట‌లకు సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ (Railway Station) నుంచి ఎంజీ రోడ్‌ (MG Road) లోని గాంధీ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ నిర్వ‌హిస్తున్న‌ట్లు వివ‌రించారు. సికింద్రాబాద్ నివాసితులు ఇంటికొక‌రు చొప్పున ర్యాలీకి త‌ర‌లిరావాల‌ని పిలుపునిచ్చారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్ అని చెప్పారు. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్‌లో ఇమిడి ఉన్నాయన్నారు. లష్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉందని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. కమిషనరేట్‌లు అక్రమంగా కలిపారని మండిపడ్డారు. వాటిని ఎందుకు కలిపారో చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో అన్ని రంగాలకు చెందిన‌ సంఘాల ప్ర‌తినిధులు పాల్గొనాల‌ని కోరారు.

సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని ప‌రిర‌క్షించుకునేందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు ఇదే మంచి స‌మ‌య‌మ‌ని చెప్పారు. ర్యాలీకి బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌ర‌వుతార‌ని తెలిపారు. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ నేత‌లు అధికారంలోకి వచ్చారని మండిప‌డ్డారు. ఆ హామీలు అమలు చేయకుండా పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. లష్కర్ జిల్లా సాధన సమితి పేరుతో రెండేళ్లుగా ఉద్య‌మాలు చేస్తున్న‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం స్పందించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు త‌ప్ప‌నిస‌రిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. ఇది శాంతియుత ర్యాలీ అని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టు నుంచి అనుమతి తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement