Eatala Rajender | పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలి: ఎంపీ ఈటల రాజేందర్
Eatala Rajender | పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ప్రభుత్వ భూములను పేదలు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేదనే భావన ప్రజల్లో వచ్చిందని, ఇది మంచిది కాదని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) అన్నారు. ప్రభుత్వ భూములను పేదలు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేదనే భావన ప్రజల్లో వచ్చిందని, ఇది మంచిది కాదని చెప్పారు. కూకట్పల్లిలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. `కూకట్ పల్లి కాంక్రీట్ జంగల్గా మారింది. ఇది అత్యధిక జనసాంద్రత గల ప్రాంతం. హౌసింగ్ బోర్డ్ కాలనీల్లో మిగిలిన స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి లేదా ప్రభుత్వమే వాటిని వేలంలో అమ్ముతున్నది. అలాకాకుండా ప్రజలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ సేదతీరేలా ఖాళీ స్థలాలను పార్క్ లుగా మార్చాలి.
40, 50 ఏండ్ల కింద ఏర్పడ్డ లే అవుట్లలో ఖాళీగా ఉన్న పార్క్, స్కూల్స్ స్థలాలను బై నంబర్లు వేసి కబ్జా చేస్తున్నారు. అన్ని చోట్ల తనిఖీలు చేసి ప్రభుత్వం వాటిని కాపాడాలి. సివిల్ తగాదాలు, భూ పంచాయతీలకు పోలీస్ స్టేషన్లు అడ్డాలుగా మారడం మంచిది కాదు. గొప్ప పేరున్న తెలంగాణ పోలీస్కి ఇది మచ్చ తీసుకువస్తుంది. రెవెన్యూ శాఖ ఈ పని చేయాలి.
కొందరు బడాబాబులు దొంగ డాక్యుమెంట్ సృష్టించి, కోర్టులలో పిటిషన్లు వేయడంతోపాటు అధికారులను మేనేజ్ చేసి పేదలను ఇబ్బంది పెడుతున్నారు. సామాన్యులకు ఈ పని చేసి పెడితే మంత్రి శ్రీనివాస్ రెడ్డికి మంచి పేరు వస్తుంది. పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా ఉండాలి. ఇలాంటి భూముల విషయంలో కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయి.
ప్రభుత్వం పేదలకు ఎప్పుడో ఏక్ సాల్ పట్టా అని ఇచ్చింది. ఆ భూములు బ్రోకర్లు కబ్జా పెట్టారు. వీటి మీద కూడా సర్కార్ దృష్టి పెట్టాలి. ఒకవేళ నిజమైన పేదలు ఆ భూమి మీద ఉంటే వారికి నష్టపరిహారం చెల్లించి, ఆ భూములను సేకరించాలి తప్ప వారిని తరిమివేయవద్దు.
హెచ్ఎంటీ, ఐడీపీఎల్ భూముల్లో 60 గజాల్లో పేదలు కట్టుకున్న ఇండ్లను కూలగొట్టద్దు. బడాబాబులు ఆక్రమిస్తే మాత్రం వెనక్కు తీసుకోవాలి. పెదోళ్ళు ఆక్రమిస్తే కూలగొడుతున్నారు.. పెద్దోళ్లు ఆక్రమిస్తే మాత్రం ఏమీ అనడం లేదనే భావన ప్రజల్లో వచ్చింది. ఇది మంచిది కాదు. ఈ విషయం సీఎం దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ను కోరారు. చాలా పెద్ద కంపెనీలు ప్రీ బుకింగ్ పేరుతో వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయు. ఇలాంటి వాటివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వీటిమీద ఉక్కుపాదం పెట్టాలని సూచించారు.
సంబంధిత వార్తలు

Eatala Rajender | బీజేపీ వారసత్వ పార్టీ కాదు.. నా బాధ అదే : ఎంపీ ఈటల రాజేందర్
మే 2, 2026

Eatala Rajender | ఆర్టీసీ గురించి ఆనాడు కేసీఆర్కు వ్యతిరేకంగా మాట్లాడిన కాంగ్రెస్.. ఇప్పుడు అదే పనిచేస్తోంది : ఈటల రాజేందర్
ఏప్రిల్ 23, 2026

Eatala Rajender | అడ్డుకుంది బిల్లును కాదు.. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని: ఎంపీ ఈటల రాజేందర్
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



