త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OU | వయోపరిమితి పెంపుపై హ‌ర్షం.. ఓయూలో సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం

OU | రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులు మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

P

Hyderabad | Published On May 19, 2026, 3.20 pm IST

OU | వయోపరిమితి పెంపుపై హ‌ర్షం.. ఓయూలో సీఎం చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం
Advertisement

OU | రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల దరఖాస్తులకు గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిరుద్యోగులు మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నిరుద్యోగ జేఏసీ నేత డాక్టర్ కోటూరి మానవతారాయ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా మానవతారాయ్ మాట్లాడుతూ న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 40వేల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. కొందరు రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం కృత్రిమ నిరుద్యోగ నాయకులుగా అవతారమెత్తుతున్నారని, వారి మాటలు విని నిజమైన నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు కొప్పుల ప్రతాప్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నాయకులు రాథోడ్ రవీంద్ర నాయక్, నిరుద్యోగ జేఏసీ నాయకులు జగన్నాథ్ యాదవ్, అశోక్, హేమంత్ చౌదరి, నాగార్జున, దేవ్‌లాల్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement