త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Traffic Advisory | అర్ధరాత్రి పూట అక్కడ ఆంక్షలు…ఎందుకో తెలుసా

Traffic Advisory | హైదరాబాద్‌లోని మెహదీపట్నం రైతుబజార్, బస్టాప్ పరిసరాల్లో స్కైవాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు.

P

Hyderabad | Published On Apr 21, 2026, 7.08 pm IST

Traffic Advisory | అర్ధరాత్రి పూట అక్కడ ఆంక్షలు…ఎందుకో తెలుసా
Advertisement

Traffic Advisory | హైదరాబాద్‌లోని మెహదీపట్నం రైతుబజార్, బస్టాప్ పరిసరాల్లో స్కైవాక్ నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహ‌నాల‌ను మ‌ళ్లిస్తున్న‌ట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించారు. ఈ మార్పులు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి నుంచి బుధ‌వారం, బుధ‌వారం అర్ధ‌రాత్రి నుంచి గురువారం ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు అమ‌లులో ఉంటాయ‌ని అధికారులు పేర్కొన్నారు. మాసబ్ ట్యాంక్ నుంచి రేతిబౌలి, నానల్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను ఎన్‌ఎండీసీ, ఎస్‌డీ కంటి ఆసుపత్రి మార్గం నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్లు 2, 3 వద్ద ఉన్న అజీజియా మసీదు దగ్గర మళ్లించనున్నారు. అక్కడి నుంచి మెరాజ్ కేఫ్ వద్ద కుడివైపు తిరిగి మెహదీపట్నం (పిల్లర్ నంబర్ 15 వద్ద) మీదుగా తిరిగి సాధారణ రోడ్‌లోకి చేర‌వ‌చ్చ‌ని తెలిపారు.

అలాగే టోలిచౌకి, లంగర్ హౌస్, అత్తాపూర్ ప్రాంతాల నుంచి మాసబ్ ట్యాంక్ వైపు వచ్చే వాహనాలను పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 23 వద్ద ఉన్న యూ-టర్న్ వద్ద మ‌ళ్లించ‌నున్నారు. అక్కడి నుంచి వ్యతిరేక దిశలో ప్రయాణించి పిల్లర్ నంబర్లు 4, 5 వద్ద తిరిగి ప్రధాన మార్గంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్ అప్‌డేట్స్ కోసం నగర ట్రాఫిక్ పోలీసుల సామాజిక మాధ్యమ ఖాతాలను అనుసరించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో హెల్ప్‌లైన్ నంబర్ 9010203626 ను సంప్రదించాలన్నారు. స్కైవాక్ నిర్మాణ పనులు పూర్తయ్యే వరకు వాహనదారులు సహనంతో వ్యవహరించి, సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని జాయింట్ సీపీ (ట్రాఫిక్‌) జోయల్ డేవిస్ సూచించారు.

Advertisement
Advertisement