త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rainfall | హైద‌రాబాద్‌లో లోటు వ‌ర్ష‌పాతం.. దంచికొడుతున్న ఎండ‌లు

Rainfall | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌స్తుత వాతావర‌ణ ప‌రిస్థితులు వేస‌విని త‌ల‌పిస్తున్నాయి. వానాకాలం అయిన‌ప్ప‌టికీ ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు కురియ‌డం లేదు. దీంతో న‌గ‌ర వ్యాప్తంగా లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

S

Hyderabad | Published On Jul 26, 2026, 2.13 pm IST

Rainfall | హైద‌రాబాద్‌లో లోటు వ‌ర్ష‌పాతం.. దంచికొడుతున్న ఎండ‌లు
Advertisement

Rainfall | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌స్తుత వాతావర‌ణ ప‌రిస్థితులు వేస‌విని త‌ల‌పిస్తున్నాయి. వానాకాలం అయిన‌ప్ప‌టికీ ఎల్‌నినో ప్ర‌భావంతో వ‌ర్షాలు కురియ‌డం లేదు. దీంతో న‌గ‌ర వ్యాప్తంగా లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. ఈ కార‌ణంగా ఎండ‌లు దంచికొడుతున్నాయి. ప‌గ‌లు, రాత్రి వేళ భారీగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదై న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నాలుగైదు రోజుల క్రితం మోస్త‌రు వ‌ర్షాలు కురిసిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది.

టీజీడీపీఎస్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో హైద‌రాబాద్ న‌గ‌రంలో అత్య‌ధికంగా 33.4 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి. అంబ‌ర్‌పేట ఏరియాలో 32.6 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కాగా, రాజ‌ధానికి స‌మీపంలో ఉన్న సూర్యాపేట జిల్లాలో 38.3 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదై స్థానికుల‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఈ మండుటెండ‌ల‌కు లోటు వ‌ర్ష‌పాత‌మే కార‌ణ‌మని టీజీడీపీఎస్ వెల్ల‌డించింది.

ఇక జూన్ 1 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌రాబాద్‌లో కేవ‌లం 152.3 మి.మీ. వ‌ర్ష‌పాతం మాత్ర‌మే న‌మోదైంది. ఈ స‌మ‌యంలో సాధార‌ణంగా 255.8 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు కావాలి. అంటే 40 శాతం లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైంది. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 59 శాతం, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలో 15 శాతం చొప్పున లోటు వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు టీజీడీపీఎస్ వెల్ల‌డించింది.

Advertisement
Advertisement