త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chandrayangutta | హైద‌రాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

Two Died | నగరంలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. పాతబస్తీలో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల‌ను చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. వర్షానికి విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

P

Hyderabad | Published On Jun 9, 2026, 8.01 pm IST

Chandrayangutta | హైద‌రాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
Advertisement

Chandrayangutta | నగరంలో కురిసిన భారీ వర్షం విషాదాన్ని మిగిల్చింది. పాతబస్తీలో కరెంట్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల‌ను చాంద్రాయణగుట్టకు చెందిన జాఫర్, అబూగా గుర్తించారు. వర్షానికి విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు వర్షం కారణంగా వాహనం నుంచి దిగిన సమయంలో రోడ్డుపై పడిన విద్యుత్ వైర్లను గమనించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. వెంటనే విద్యుత్ షాక్‌కు గురైన ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement