త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heat Wave | హైద‌రాబాద్‌లో మండుటెండ‌లు.. 40 డిగ్రీల‌కు చేరువ‌లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు

Heat Wave | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. సెప్టెంబ‌ర్ మాసం మే నెల‌ను త‌ల‌పిస్తోంది. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీల‌కు చేరువ‌లో న‌మోదై ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

S

Hyderabad | Published On Sep 17, 2026, 6.40 am IST

Heat Wave | హైద‌రాబాద్‌లో మండుటెండ‌లు.. 40 డిగ్రీల‌కు చేరువ‌లో ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు
Advertisement

Heat Wave | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో ఎండ‌లు మండిపోతున్నాయి. సెప్టెంబ‌ర్ మాసం మే నెల‌ను త‌ల‌పిస్తోంది. ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీల‌కు చేరువ‌లో న‌మోదై ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. బుధ‌వారం న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు అయ్యాయి.

తెలంగాణ స్టేట్ డెవ‌ల‌ప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ నివేదిక ప్ర‌కారం.. హైటెక్ సిటీ కారిడార్‌, గ‌చ్చిబౌలి ఏరియాల్లో 37.1 డిగ్రీలు, కాప్రాలో 36.7, బాలాన‌గ‌ర్‌లో 36.5 డిగ్రీలు, శేరిలింగంప‌ల్లిలో 36.4, ఉప్ప‌ల్‌లో 36.2, మియాపూర్‌లో 36.1 డిగ్రీల సెల్సియ‌స్ ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయి.

భారీగా ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో మ‌రి ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. దీర్ఘ‌కాలిక వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు కూడా చ‌ల్ల‌ని ప్రాంతాల‌కే ప‌రిమితం కావాల‌ని సూచిస్తున్నారు. శ‌రీరం డీహైడ్రేట్‌కు గురైన‌ట్లు అనిపిస్తే త‌క్ష‌ణ‌మే వైద్యుల‌ను సంప్ర‌దించాలి.

Advertisement
Advertisement