త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Governor Shiv Pratap Shukla | ఆ దృశ్యాలు మాన‌వ‌త్వానికి నిద‌ర్శ‌నం : గవ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా

Governor Shiv Pratap Shukla | హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత మాడ్యులర్ కృత్రిమ అవయవాల (లింబ్స్ & కాలిపర్స్) పంపిణీ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు.

S

Hyderabad | Published On May 3, 2026, 6.14 pm IST

Governor Shiv Pratap Shukla | ఆ దృశ్యాలు మాన‌వ‌త్వానికి నిద‌ర్శ‌నం : గవ‌ర్న‌ర్ శివ‌ప్ర‌తాప్ శుక్లా
Advertisement

Governor Shiv Pratap Shukla | త్రినేత్ర‌.న్యూస్ : హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నారాయణ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఉచిత మాడ్యులర్ కృత్రిమ అవయవాల (లింబ్స్ & కాలిపర్స్) పంపిణీ శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరాన్ని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 745 మంది దివ్యాంగులకు 815 కృత్రిమ అవయవాలను ఉచితంగా అందజేశారు. కొత్త అవయవాలతో పలువురు లబ్ధిదారులు మొదటిసారి నడవడం, ఆడుకోవడం, స్వతంత్రంగా పనులు చేసుకోవడం వంటి భావోద్వేగ క్షణాలు చోటుచేసుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. ఈ రోజు కనిపించిన దృశ్యాలు మానవత్వానికి నిదర్శనం. నారాయణ సేవా సంస్థాన్ చేస్తున్న సేవలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయి అని తెలిపారు.

అనంత‌రం ఏపీ మంత్రి టీజీ భ‌ర‌త్ మాట్లాడుతూ.. దివ్యాంగులను సమాజంలో ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడంలో ఈ కార్యక్రమం ఎంతో కీలకం. ఇది సేవ మాత్రమే కాదు, జీవితాలను మార్చే ఉద్యమం అని పేర్కొన్నారు.

సామాజిక సేవకుడు సత్య భూషణ్ జైన్, పేట్రన్ అల్కా చౌధరీ, ట్రస్టీ & డైరెక్టర్ దేవేంద్ర చౌబిసా, పీఆర్ హెడ్ భగవాన్ ప్రసాద్ గౌర్ ప్రముఖులను సాంప్రదాయంగా ఆహ్వానించారు.

ఫిబ్రవరి 1న నిర్వహించిన ఎంపిక శిబిరంలో 1,000 మందికి పైగా దివ్యాంగులు నమోదు చేసుకోగా, అందులో 745 మందికి ఈ శిబిరంలో సేవలు అందించామని ట్ర‌స్టీ డైరెక్ట‌ర్ దేవేంద్ర చౌబిసా తెలిపారు. నిపుణుల బృందం ఆధునిక నారాయణ మాడ్యులర్ కృత్రిమ అవయవాలను అమర్చడంతో పాటు, వాటి వినియోగం, నిర్వహణపై శిక్షణ కూడా ఇచ్చినట్లు చెప్పారు. శిబిరానికి వచ్చిన అందరికీ ఉచిత భోజనం, తాగునీరు, టీ వంటి సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాహుల్ ఖన్నా, మహేంద్ర అగర్వాల్, గోవింద్ రాఠీ, అశోక్ పామ్రేచా, వర్ధమాన్ బ్యాంక్‌కు చెందిన మహేంద్ర గోల్చా, ప్రేమ్ ప్రకాష్ సింగ్‌వి వంటి పలువురు దాతలను సన్మానించారు. నారాయణ సేవా సంస్థాన్ 1985 నుంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇప్పటివరకు లక్షలాది మందికి ఉచిత వైద్య సేవలు, వేలాది మందికి కృత్రిమ అవయవాలను అందించింది.

Advertisement
Advertisement