త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | హైద‌రాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. సోఫా కంపెనీ ద‌గ్ధం

Hyderabad | హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. బ‌హ‌దూర్‌పురా ప‌రిధిలోని కిష‌న్‌బాగ్‌లో ఉన్న సోఫా త‌యారీ కేంద్రంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి.

S

Hyderabad | Published On Apr 28, 2026, 5.05 pm IST

Hyderabad | హైద‌రాబాద్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. సోఫా కంపెనీ ద‌గ్ధం
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. బ‌హ‌దూర్‌పురా ప‌రిధిలోని కిష‌న్‌బాగ్‌లో ఉన్న సోఫా త‌యారీ కేంద్రంలో అగ్నికీల‌లు ఎగిసిప‌డ్డాయి. క్ష‌ణాల్లోనే కంపెనీ మొత్తం మంట‌లు వ్యాపించి ద‌గ్ధ‌మైంది. సోఫాల‌తో పాటు ఇత‌ర సామాగ్రి కాలి బూడిదైంది.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేసింది. సోఫా కంపెనీలో నిల్వ చేసిన ప్లేవుడ్ మెటిరీయ‌ల్ యూనిట్‌లో మంట‌లు చెల‌రేగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ అగ్నిప్ర‌మాదం కార‌ణంగా భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ద‌ట్టంగా పొగ‌లు క‌మ్ముకోవ‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ప‌క్క‌నే ఉన్న దుకాణాల‌కు మంట‌లు వ్యాపించ‌కుండా స్థానికులు జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

Advertisement
Advertisement