త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | గాలి వాన బీభ‌త్సం.. క‌రెంట్ షాక్‌తో తండ్రీకూతురు మృతి

Hyderabad | రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో శుక్ర‌వారం రాత్రి గాలి వాన బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని ప‌లుచోట్ల‌ భారీ ఈదురుగాలులు వీచ‌డంతో.. భారీ వృక్షాలు నేల‌కొరిగాయి.

S

Hyderabad | Published On Jun 13, 2026, 1.39 pm IST

Hyderabad | గాలి వాన బీభ‌త్సం.. క‌రెంట్ షాక్‌తో తండ్రీకూతురు మృతి
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో శుక్ర‌వారం రాత్రి గాలి వాన బీభ‌త్సం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. న‌గ‌రంలోని ప‌లుచోట్ల‌ భారీ ఈదురుగాలులు వీచ‌డంతో.. భారీ వృక్షాలు నేల‌కొరిగాయి. మేడ్చ‌ల్ జిల్లా అల్వాల్ టెలికాం కాల‌నీలో గాలివాన‌కు ఓ చెట్టు కొమ్మ‌లు కారుపై విరిగిప‌డ్డాయి.

కారుపై ప‌డ్డ చెట్టు కొమ్మ‌ల‌ను తొల‌గించేందుకు దాని య‌జ‌మాని సందీప్(44), కూతురు రితిక‌(16) శ‌నివారం ఉద‌యం ప్ర‌య‌త్నించారు. అయితే ఆ చెట్టు కొమ్మ‌ల మ‌ధ్య ఉన్న విద్యుత్ తీగ‌ల‌ను తండ్రీకూతుళ్లు గ‌మ‌నించ‌లేదు. చెట్టు కొమ్మ‌ల‌ను ముట్టుకోగానే విద్యుత్ షాక్ త‌గిలి అక్క‌డికక్క‌డే కుప్ప‌కూలిపోయారు. సందీప్ భార్య శ్వేత‌కు స్వ‌ల్ప గాయాల‌య్యాయి. మృత‌దేహాల‌ను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement
Advertisement