త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Osmania University | తెలంగాణ ప్రతీపల్లె పద సాహిత్య మయం: ఎమ్మెల్సీ గోరేటి వెంక‌న్న‌

Osmania University | తెలంగాణ (Telangana)లోని ప్రతీపల్లె పద సాహిత్యాలతో, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని ఎమ్మెల్సీ (MLC), ప్రముఖ వాగ్గేయకారులు డాక్ట‌ర్‌ గోరటి వెంకన్న (Goreti Venkanna) అన్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) ఆర్ట్స్ కళాశాల (Arts College) వేదికగా, తెలుగు శాఖ (Telugu Department) నిర్వహించిన "తెలంగాణ పద సాహిత్యం - సమాలోచన" అనే జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు.

A

Hyderabad | Published On Dec 29, 2025, 7.26 pm IST

Osmania University | తెలంగాణ ప్రతీపల్లె పద సాహిత్య మయం: ఎమ్మెల్సీ గోరేటి వెంక‌న్న‌
Advertisement

Osmania University | తెలంగాణ (Telangana)లోని ప్రతీపల్లె పద సాహిత్యాలతో, భజన కీర్తనలతో విరాజిల్లుతోందని ఎమ్మెల్సీ (MLC), ప్రముఖ వాగ్గేయకారులు డాక్ట‌ర్‌ గోరటి వెంకన్న (Goreti Venkanna) అన్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ (Osmania University) ఆర్ట్స్ కళాశాల (Arts College) వేదికగా, తెలుగు శాఖ (Telugu Department) నిర్వహించిన "తెలంగాణ పద సాహిత్యం - సమాలోచన" అనే జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. అలాగే కీలక ఉపన్యాసం చేసిన ప్రముఖ పరిశోధకులు డాక్ట‌ర్‌ పి భాస్కర యోగి మాట్లాడుతూ సాహిత్య చరిత్రలో విస్మరణకు గురైన ఎందరో పద కవులపై విస్తృతమైన పరిశోధనలు జరగడం అభినందించదగిన విషయమని అన్నారు. ఆ దిశలో తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో తెలంగాణ పద సాహిత్యంపై జాతీయ సదస్సు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని అన్నారు.

తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ప్రొఫెస‌ర్‌ వెలుదండ నిత్యానందరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రథ‌మ అధ్యక్షుడు డాక్ట‌ర్‌ నందిని సిధారెడ్డి, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెస‌ర్ సి. కాశీం, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ ప్రొఫెస‌ర్ సైయీదా తలత్ సుల్తానాలు ప్రసంగించారు. అలాగే ఈ సదస్సులో తెలంగాణ పద సాహిత్యంపై ప్రామాణికమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. తెలంగాణలోని సబ్బండ వర్గాల వారి సాంస్కృతిక విశేషాలను, తాత్విక విషయాలపై పద కవుల సాహిత్యంపై లోతైన విశ్లేషణలు అవసరమని పలువురు వ్యక్తులు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సు స్ఫూర్తితో పలువురు పద కర్తలపై విస్తృతమైన పరిశోధనలు సమగ్రంగా జ‌రిగేందుకు దారులు ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో తెలుగు బోర్డ్ ఆఫ్ స్ట‌డీస్ చైర్‌ప‌ర్స‌న్ డాక్ట‌ర్‌ ఏలే విజయలక్ష్మి, డాక్టర్ ఎస్. రఘు, ప్రొఫెస‌ర్‌ విస్తాలి శంకర్రావు, డాక్ట‌ర్‌ పి.సి. వెంకటేశ్వర్లు, డాక్ట‌ర్‌ బాణాల భుజంగ రెడ్డి, డాక్ట‌ర్‌ యువ శ్రీ, డాక్ట‌ర్‌ ఇమ్మిడి మహేందర్, అవుసుల భాను ప్రకాష్ తదితరులు ప్రసంగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement