త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cyberabad CP M Ramesh | ఆ పరిస్థితుల్లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి : సైబరాబాద్ సీపీ రమేశ్

సైబరాబాద్ సీపీ రమేశ్ నేతృత్వంలో జరిగిన క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు. మహిళల భద్రత, సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా అధికారులకు ఆదేశాలు.

J

Hyderabad | Published On Jun 18, 2026, 10.00 pm IST

Cyberabad CP M Ramesh | ఆ పరిస్థితుల్లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయండి : సైబరాబాద్ సీపీ రమేశ్
Advertisement
  • సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ ఎం. రమేశ్ ఆధ్వర్యంలో ఉన్నతాధికారులతో నేర సమీక్షా సమావేశం
  • మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల కట్టడిపై అధికారులకు కీలక దిశానిర్దేశం
  • పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, బాధితులకు అండగా జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదుపై స్పెషల్ ఫోకస్
  • ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని సీపీ ఆదేశాలు

Cyberabad CP M Ramesh | త్రినేత్ర.న్యూస్ : సైబరాబాద్ (Cyberabad) పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సైబరాబాద్ సీపీ (CP) డాక్టర్ ఎం.రమేశ్ ఐపీఎస్ అధ్యక్షతన సీపీ ఆఫీసులోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్‌లో భారీ క్రైమ్ రివ్యూ మీటింగ్ (Crime review meeting) నిర్వహించారు. జోనల్ డీసీపీలు, క్రైమ్ విభాగాల అధికారులు హాజరైన ఈ సమావేశంలో.. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళలు-చిన్నారుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రధాన ఎజెండాగా సాగింది.

పెండింగ్ కేసులపై సీరియస్

సైబరాబాద్ పరిధిలో నమోదైన సీరియస్ క్రైమ్స్ (Grave cases), ఆర్థిక నేరాలు (EOW), పోక్సో (POCSO), కిడ్నాప్, హత్య కేసుల దర్యాప్తు పురోగతిని సీపీ రమేశ్ సమీక్షించారు. దర్యాప్తులో వేగం పెంచి, నిందితులను వీలైనంత త్వరగా చట్టం ముందు నిలబెట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడే శాతాన్ని (Conviction rate) పెంచేలా పక్కా సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు.

Cyberabad CP M Ramesh Holds Crime Review Meeting Focus on Women Safety and Pending Cases

మహిళల భద్రతకే పెద్దపీట.. జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు

మహిళలు, చిన్నపిల్లలపై జరిగే నేరాలను అత్యంత ప్రాధాన్యతతో (High priority) విచారించాలని సీపీ స్పష్టం చేశారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణ సేవలు అందేలా చూడాలని, అవసరమైతే జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాలని సూచించారు. డయల్ 100 (Dial 100) కాల్స్‌కు వెంటనే స్పందించడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఫుట్ పెట్రోలింగ్ (Foot patrolling) ముమ్మరం చేయాలన్నారు.

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్

ట్రాఫిక్ నియంత్రణపై కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ (IT Corridor), రద్దీ జంక్షన్లలో పబ్లిక్‌కు ఇబ్బందులు కలగకుండా మెరుగైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఉండాలని సీపీ సూచించారు. అలాగే డ్రగ్స్ నిర్మూలన, సైబర్ నేరగాళ్ల ఆటకట్టించడం, సీసీటీఎన్ఎస్ (CCTNS) డేటాను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం, పెండింగ్ నాన్-బెయిలబుల్ వారెంట్ల (NBW) అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో అడ్మిన్ డీసీపీ టి. అన్నపూర్ణ, కుత్బుల్లాపూర్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి, కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి, సైబర్ క్రైమ్స్ డీసీపీ టి. సాయి మనోహర్, క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డితో పాటు పలువురు ఏడీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలు (SHOs) పాల్గొన్నారు.

Advertisement
Advertisement