త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్ర‌క్షాళ‌న ప‌నులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | ఈ వంద రోజుల్లోనే మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులు ప్రారంభిస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు.

S

Hyderabad | Published On Jun 7, 2026, 8.31 pm IST

CM Revanth Reddy | ఈ 100 రోజుల్లోనే మూసీ ప్ర‌క్షాళ‌న ప‌నులు ప్రారంభిస్తా : సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

నేను చేయ‌గ‌లిగింది ఇది ఒక్క‌టే..
పూర్తిస్థాయిలో అంచ‌నాలు వేయండి
అధికారుల‌కు సీఎం ఆదేశాలు

CM Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్ : ఈ వంద రోజుల్లోనే మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులు ప్రారంభిస్తాన‌ని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో మ‌ల్కాజ్‌గిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కార్యాల‌యానికి శంకుస్థాప‌న సంద‌ర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు.

మూసీ ప్ర‌క్షాళ‌న‌లో భాగంగా గండిపేట నుంచి గాంధీ స‌రోవ‌ర్ వ‌ర‌కు ఫేజ్ -1 కింద‌ మొద‌టి విడ‌త‌గా ప‌ని చేస్తున్నాం. రెండో విడ‌త నాగోలు నుంచి గౌరెల్లి వ‌ర‌కు ఫేజ్-2 కింద ఈ 100 రోజుల్లోనే మూసీ ప్రక్షాళ‌న ప‌నులు ప్రారంభిస్తాం. ఈ ప్రాంతంలో భూసేక‌ర‌ణ‌కు సంబంధించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి. ఫేజ్ 2 మూసీ ప్ర‌క్షాళ‌న మీద, ఎలివేటెడ్ కారిడార్ మీద, వ‌న‌స్థ‌లిపుం నుంచి ఇక్క‌డికి, ఇక్క‌డ్నుంచి వ‌రంగ‌ల్ రోడ్డు వ‌ర‌కు అభివృద్ధి చేసే బాధ్య‌త తీసుకుంటాను. వంద రోజుల్లో ఫేజ్ 2 ప‌నులు జ‌ర‌గాలి. పూర్తిస్థాయిలో అంచ‌నాలు వేయండి.. ప్ర‌భుత్వ అనుమ‌తులు తీసుకోండి.. ఈ ప్రాంతానికి సేవ చేయ‌గ‌లిగింది ఇదే. నేను చేయ‌గ‌లిగింది ఇది ఒక్క‌టే అని సీఎం రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement