త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ACB Raids | ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహ‌న్ నాయ‌క్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై రోడ్లు భ‌వ‌నాల శాఖ ) ఇంజినీర్ ఇన్ చీఫ్ జే మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ‌ద్ద సుమారు రూ.17.94 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింద‌ని ఏసీబీ అధికారులు తెలిపింది.

P

Hyderabad | Published On Jun 9, 2026, 7.07 pm IST

ACB Raids | ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహ‌న్ నాయ‌క్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!
Advertisement

ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై రోడ్లు భ‌వ‌నాల శాఖ ) ఇంజినీర్ ఇన్ చీఫ్ జే మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఆయ‌న వ‌ద్ద సుమారు రూ.17.94 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలింద‌ని ఏసీబీ అధికారులు తెలిపింది. మోహన్ నాయక్ అక్ర‌మంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆయ‌న‌తో నివాసంతో పాటు బంధువులు, స‌న్నిహితుల‌కు చెందిన 15 ప్రాంతాల్లో ఏక‌కాలంలో సోదాలు నిర్వ‌హించింది. నిజామాబాద్ జిల్లా దిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూములు సుమారు రూ.82.89 లక్షల ఉంద‌ని గుర్తించారు. అలాగే, కొంపల్లిలో 3 ఫ్లాట్లు, గచ్చిబౌలిలో 4 ఫ్లాట్లు కలిపి సుమారు రూ.7.34 కోట్ల విలువ ఉన్నట్లు అంచనా వేశారు.

మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా (సుమారు రూ.2.5 కోట్లు), కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న ఇల్లు (సుమారు రూ.62.14 లక్షలు), నిజామాబాద్‌లో కొత్తగా కొనుగోలు కోసం ముందస్తుగా ఇచ్చిన రూ.కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్లు తెలిసింది. అంతేకాకుండా రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.1.44 కోట్లు, సుమారు 2,500 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.2 కోట్లు), 6 కిలోల వెండి వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు (9 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు), అలాగే రెండు వాహనాలు ఉన్న‌ట్లుగా గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.17,94,62,617 ఉన్న‌ట్లుగా ప్రాథ‌మికంగా అధికారులు అంచ‌నా వేశారు. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువ‌గా ఉండ‌వ‌చ్చ‌ని ఏసీబీ తెలిపింది. ఆస్తులపై ఇంకా విచారణ కొనసాగుతోందని ఏసీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈ కేసులో సంబంధిత అధికారిని అరెస్టు చేసి హైద‌రాబాద్‌లోని స్పెష‌ల్ జ‌డ్జి ముందు ప్ర‌వేశ‌పెట్టి రిమాండ్ చేయ‌నున్న‌ట్లు ఏసీబీ తెలిపింది.

Advertisement
Advertisement