త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MRI Scanning | అర్హులైన రోగుల‌కు ఉచితంగా ఎంఆర్ఐ స్కానింగ్

MRI Scanning | ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటుంబాల్లోని రోగుల‌కు శుభ‌వార్త‌. ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకునేందుకు కూడా పైస‌ల్లేని రోగుల‌కు కొండాపూర్‌లోని ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్ గుడ్ న్యూస్ చెప్పింది.

S

Hyderabad | Published On Sep 15, 2026, 5.49 pm IST

MRI Scanning | అర్హులైన రోగుల‌కు ఉచితంగా ఎంఆర్ఐ స్కానింగ్
Advertisement

MRI Scanning | త్రినేత్ర‌.న్యూస్ : ఆర్థికంగా వెనుక‌బ‌డిన కుటుంబాల్లోని రోగుల‌కు శుభ‌వార్త‌. ఎంఆర్ఐ స్కాన్ కూడా చేయించుకునేందుకు కూడా పైస‌ల్లేని రోగుల‌కు కొండాపూర్‌లోని ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన రోగుల‌కు ఉచితంగా ఎంఆర్ఐ స్కాన్ చేయ‌నున్నామ‌ని ప్ర‌క‌టించింది.

అయితే ఈ స‌దుపాయం పొందాలంటే.. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి డాక్ట‌ర్ నుంచి రిఫ‌రల్ నోట్, ఎన్జీవో సంస్థ నుంచి లేఖ తీసుకురావాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు. అంటే స‌ద‌రు రోగికి ఎంఆర్ఐ స్కాన్ అవ‌స‌ర‌మ‌ని ఎన్జీవో నిర్ధారిస్తే.. త‌ప్ప‌కుండా ఉచితంగా చేస్తామ‌ని తెలిపారు.

ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్ ఈడీ డాక్ట‌ర్ ప్ర‌స‌న్న విఘ్నేష్ మాట్లాడుతూ.. నిజంగా ఎంఆర్ఐ అవ‌స‌రం ఉన్న వారికి ఎలాంటి రుసుం లేకుండా ఉచితంగా చేస్తామ‌న్నారు. ఈ అవ‌కాశాన్ని నిరుపేద రోగులు వినియోగించుకోవాల‌ని సూచించారు.

Advertisement
Advertisement