త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ఏటీఎంలోకి వెళ్లాడు.. ఊపిరాడ‌క చనిపోయాడు..

Hyderabad | ఓ వ్య‌క్తి డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంట‌ర్‌కు వెళ్లాడు. డ‌బ్బులు డ్రా చేసుకునే లోపే ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయాడు.

S

Hyderabad | Published On Apr 24, 2026, 3.12 pm IST

Hyderabad | ఏటీఎంలోకి వెళ్లాడు.. ఊపిరాడ‌క చనిపోయాడు..
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : ఓ వ్య‌క్తి డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం సెంట‌ర్‌కు వెళ్లాడు. డ‌బ్బులు డ్రా చేసుకునే లోపే ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మెహిదీప‌ట్నం పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని న్యూమ‌ల్లేప‌ల్లిలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎం సెంట‌ర్‌కు డ‌బ్బులు డ్రా చేసుకునేందుకు ఓ వ్య‌క్తి వెళ్లాడు. ఇక డ‌బ్బులు డ్రా చేసుకుంటున్న క్ర‌మంలో ఏటీఎం సెంట‌ర్ లాక్ అయిపోయింది.

దీంతో డోర్ తెరిచేందుకు య‌త్నించిన‌ప్ప‌టికీ అది ఓపెన్ కాలేదు. గాలి లేక‌పోవ‌డంతో.. ఊపిరి ఆడ‌లేదు. దీంతో ఏటీఎం సెంట‌ర్‌లోనే కుప్ప‌కూలిపోయాడు. గ‌మ‌నించిన స్థానికులు.. ఏటీఎం సెంట‌ర్ డోర్ ప‌గుల‌గొట్టి.. స‌ద‌రు వ్య‌క్తిని బ‌య‌ట‌కు తీసుకొచ్చారు. అప్ప‌టికే అత‌ను ప్రాణాలు కోల్పోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement
Advertisement