త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | రాత్రి 10 త‌ర్వాతే మంచి నీళ్ల స‌ర‌ఫ‌రా.. జ‌ల‌మండ‌లి ప్ర‌క‌ట‌న‌

HMWSSB | హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని సింగ‌పూర్ - ఖానాపూర్ మ‌ధ్య బుల్కాపూర్ గ్రామ స‌మీపంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు మంచి నీటి పైపులైన్ ప‌గిలిపోయింది. దీంతో ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డింది.

S

Hyderabad | Published On Mar 9, 2026, 6.10 pm IST

HMWSSB | రాత్రి 10 త‌ర్వాతే మంచి నీళ్ల స‌ర‌ఫ‌రా.. జ‌ల‌మండ‌లి ప్ర‌క‌ట‌న‌
Advertisement

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోని సింగ‌పూర్ - ఖానాపూర్ మ‌ధ్య బుల్కాపూర్ గ్రామ స‌మీపంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున 5 గంట‌ల‌కు మంచి నీటి పైపులైన్ ప‌గిలిపోయింది. దీంతో ప‌లు ప్రాంతాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు ఆటంకం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో జ‌ల‌మండ‌లి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

షేక్‌పేట్ రిజ‌ర్వాయ‌ర్, భోజ‌గుట్ట రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలోని గండిపేట్, కోకాపేట్, నార్సింగి, మంచిరేవుల‌, పుప్పాల‌గూడ‌, ఖానాపూర్, మ‌ణికొండ‌తో పాటు ప‌లు ఏరియాల్లో మంచి నీళ్ల స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగింద‌ని జ‌ల‌మండ‌లి పేర్కొంది. మంచి నీళ్ల పైపులైన్ ప‌గిలిపోయింద‌ని తెలుసుకున్న జ‌లమండ‌లి ఎండీ అశోక్ రెడ్డి హుటాహుటిన ఆ ప్రాంతానికి వెళ్లి ప‌రిశీలించారు. నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌లిగిన ప్రాంతాల్లో ట్యాంక‌ర్ల‌తో మంచినీటిని స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఆదేశించారు. వీలైనంత త్వ‌ర‌గా మ‌ర‌మ్మ‌తులు చేయాల‌న్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఉద‌యం 7 గంట‌ల‌కే మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు ప‌నులు పూర్త‌వుతాయ‌ని, ఆ త‌ర్వాత‌నే నీటి స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement