త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganja Seized | రూ.20 ల‌క్ష‌ల గంజాయి సీజ్‌.. రిసీవ‌ర్ కోసం పోలీసుల‌ వేట

Ganja Seized | హైదరాబాద్‌లోని ఆటోనగర్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలో రూ.20 లక్షలు విలువజేసే గంజాయిని పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. 41 కిలోల‌ గంజాయిని ఒడిశా నుంచి హైద‌రాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో తీసుకొస్తుండ‌గా ఈగిల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ప‌ట్టుకున్నారు.

S

Hyderabad | Published On Jul 12, 2026, 4.09 pm IST

Ganja Seized | రూ.20 ల‌క్ష‌ల గంజాయి సీజ్‌.. రిసీవ‌ర్ కోసం పోలీసుల‌ వేట
Advertisement
  • ఒడిశాకు చెందిన బాబా బోలేనాథ్ బస్సు డ్రైవర్, హెల్పర్ అరెస్టు

Ganja Seized | త్రినేత్ర‌.న్యూస్: హైదరాబాద్‌లోని ఆటోనగర్ మహావీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్క్ సమీపంలో రూ.20 లక్షలు విలువజేసే గంజాయిని పోలీసులు ఆదివారం సీజ్ చేశారు. 41 కిలోల‌ గంజాయిని ఒడిశా నుంచి హైద‌రాబాద్‌కు ఓ ప్రైవేట్ బస్సులో తీసుకొస్తుండ‌గా ఈగిల్ (EAGLE) ఫోర్స్, రాచకొండ నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా ప‌ట్టుకున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌ డ్రైవర్లకు కమీషన్ ఇచ్చి గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఒడిశాకు చెందిన బాబా బోలేనాథ్ బస్సు డ్రైవర్, హెల్పర్‌ను అరెస్టు చేసి 4 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బస్సును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు నూబిన్ పరారీలో ఉండ‌గా గంజాయి రిసీవర్ కోసం పోలీసులు ముమ్మ‌రంగా గాలింపు కొనసాగిస్తున్నారు. అక్రమ మాదకద్రవ్యాల రవాణాకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి లేదా ఫిర్యాదు చేయడానికి తెలంగాణ ఈగిల్ ఫోర్స్ టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1908 లేదా వాట్సాప్ నంబర్ 87126 71111 ను సంప్రదించవచ్చని పోలీసు అధికారులు సూచించారు.

Advertisement
Advertisement