త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shraddha Kapoor | సీనియర్‌ హీరోకు జోడీగా శ్రద్ధా కపూర్‌.. ఏజ్‌ గ్యాప్‌పై సోషల్‌ మీడియాలో చర్చ..!

Shraddha Kapoor | సీనియర్ హీరో అమీర్ ఖాన్ సరసన శ్రద్ధా కపూర్ నటించనున్నారనే వార్తలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్‌పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తుండగా, బయోపిక్ కాస్టింగ్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

P

Entertainment | Published On Apr 22, 2026, 8.20 pm IST

Shraddha Kapoor | సీనియర్‌ హీరోకు జోడీగా శ్రద్ధా కపూర్‌.. ఏజ్‌ గ్యాప్‌పై సోషల్‌ మీడియాలో చర్చ..!
Advertisement

Shraddha Kapoor | బాలీవుడ్‌లో ఓ రాబోయే బయోపిక్ కాస్టింగ్ చుట్టూ ప్రస్తుతం విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో అమీర్ ఖాన్, శ్రద్ధా కపూర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ బయోపిక్‌లో అమీర్ ఖాన్ ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ పాత్రను పోషించే అవకాశం ఉంది. ఆయన వ్యాపార విజయాలు, అలాగే వివాదాస్పద అంశాలు సైతం సినిమాలో భాగంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

అష్నీర్ గ్రోవర్ ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ ద్వారా గుర్తింపు పొందారు. ఆయన భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. అదే సమయంలో అష్నీర్ గ్రోవర్ భార్య మాధురి జైన్ గ్రోవర్ పాత్రకు శ్రద్ధా కపూర్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆమె కూడా భారత్‌పేలో కీలక బాధ్యతల్లో పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అమీర్ ఖాన్–శ్రద్ధా కపూర్ మధ్య సుమారు 22 ఏళ్ల వయసు తేడా ఉండడంతో ఈ కాస్టింగ్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది ప్రేక్షకులు పాత్రలకు అనుగుణంగా ఎంపిక సరైనదేనని భావిస్తుండగా, మరికొందరు నిజజీవిత కథల ఆధారంగా రూపొందే బయోపిక్స్‌లో మరింత వాస్తవానికి దగ్గరగా కాస్టింగ్ ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

ఇక శ్రద్ధా కపూర్ ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్‌పై అవగాహన పెంచుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి రాహుల్ మోదీ సహకారం అందిస్తున్నట్లు కూడా సమాచారం. గత కొంతకాలంగా రాహుల్‌ మోదీతో శ్రద్ధ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా ప్రాజెక్ట్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, శ్రద్ధా కపూర్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో ఈత అనే బయోపిక్‌లో నటిస్తోంది. అలాగే, మహవతార్‌ ప్రాజెక్టులో శ్రద్ధా పేరును సైతం పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement