త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manushi Chhillar | నేను ఒంటరిగా లేను..! ఇన్‌స్టా చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించిన మానుషి చిల్లర్‌

Manushi Chhillar | ఫిట్‌నెస్‌ను బరువుతో కొలవలేమని మాజీ మిస్ వరల్డ్‌, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను గతంలో లేనంత బరువుగా ఉన్నప్పటికీ, అదే సమయంలో మరింత బలంగా ఉన్నానని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది.

P

Entertainment | Published On Feb 14, 2026, 2.00 pm IST

Manushi Chhillar | నేను ఒంటరిగా లేను..! ఇన్‌స్టా చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించిన మానుషి చిల్లర్‌
Advertisement

Manushi Chhillar | ఫిట్‌నెస్‌ను బరువుతో కొలవలేమని మాజీ మిస్ వరల్డ్‌, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను గతంలో లేనంత బరువుగా ఉన్నప్పటికీ, అదే సమయంలో మరింత బలంగా ఉన్నానని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు బరువును ఎలా నియంత్రించుకుంటారు? అని ప్రశ్నించగా.. తన అభిప్రాయం వెల్లడించింది. ‘నేను వెయిట్‌ని ఫిట్‌నెస్‌కి ప్రమాణంగా తీసుకోను. ఇప్పటివరకు ఉన్న దానికంటే ఇప్పుడు నా బరువు ఎక్కువే. కానీ, నేను మరింత బలంగా ఉన్నాను. అది కండరాల పెరుగుదల వల్లేనని అనుకుంటున్నాను’ అంటూ రిప్లయ్‌ ఇచ్చింది.

అంకెలు మాత్రమే శరీర దృఢత్వాన్ని నిర్వచించవని చెప్పుకొచ్చింది. తాను పూర్తిగా ఉదయాన్నే లేచే వ్యక్తినని, సినీ రంగంలోని వృత్తి కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చాయని తెలిపారు. ‘నేను వంద శాతం ఉదయం లేచే వ్యక్తిని. కానీ, నా పని నన్ను రాత్రి వేళల్లో మేల్కొని ఉండేలా మార్చింది’ చెప్పింది. ముంబయిలో ఒంటరిగా ఉంటారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నేను ఒంటరిగా ఉండడం లేదు. ముంబయికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. మేమంతా కలిసి ఒక పెద్ద సంతోషకరమైన కుటుంబంలా ఉంటున్నాం’ అని వెల్లడించారు. కుటుంబంతో కలిసి ఉండడం తనకు మానసిక బలాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఫిట్‌నెస్ ప్రయాణం గురించి మాట్లాడిన మనుషి, మూడు సంవత్సరాల క్రితం ఓ సినిమా కోసం బాక్సింగ్‌, యుద్ధకళల్లో శిక్షణ ప్రారంభించానని తెలిపారు.

మొదట సినిమా అవసరాల కోసం మొదలుపెట్టిన ఈ శిక్షణ ఇప్పుడు తనకు అత్యంత ఇష్టమైన వ్యాయామంగా మారిందని చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా అదే సాధన చేస్తానని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మానుషి చివరిసారిగా మాలిక్‌ చిత్రంలో నటించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలోని ఈ చిత్రంలో రాజ్‌కుమార్‌ రావ్‌కు జోడిగా నటించింది. పుల్కిత్ దర్శకత్వంలో కుమార్ తౌరాణి, జయ్ శేవక్రమాణి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది జూన్‌లో విడుదలైంది. అలాగే, జాన్‌ అబ్రహం ప్రధానపాత్రలో నటించిన టెహ్రాన్‌ చిత్రంలోనూ కీలకపాత్ర పోషించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన మూవీ అభిమానులను ఆకట్టుకుంది.

Advertisement
Advertisement