త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శ‌నం టికెట్లు : టీటీడీ

TTD | భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను ఈ నెల 9 నుంచి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్న‌ది.

P

Devotional | Published On Jan 6, 2026, 9.35 pm IST

TTD | ఈ నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శ‌నం టికెట్లు : టీటీడీ
Advertisement

TTD | భక్తుల సౌకర్యార్థం, పరిపాలనా అవసరాల దృష్ట్యా టీటీడీ శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు తిరుమలలో ఆఫ్‌లైన్ కౌంటర్ల ద్వారా జారీ చేస్తున్న టికెట్లను ఈ నెల 9 నుంచి రోజువారి ఆన్‌లైన్ కరెంట్ బుకింగ్ విధానంలో కేటాయించ‌నున్న‌ది. ఈ మేరకు తిరుమలలో రోజువారి విధానంలో ఆఫ్‌లైన్ ద్వారా జారీ చేస్తున్న 800 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్‌లైన్ విధానంలో జారీ చేయ‌నున్న‌ది. ఈ టికెట్లను ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసి, మధ్యాహ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉంచుతారు. టికెట్ పొందిన భ‌క్తులు అదే రోజు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంద‌ని టీటీడీ పేర్కొంది. ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (న‌లుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుంద‌ని.. టికెట్ల బుకింగ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధ్రువీక‌ర‌ణ‌, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి చేసింది.

ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ‌డ్ విధానంలో భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చ‌ని.. త‌ద్వారా ఆఫ్ లైన్‌లో శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కోసం భ‌క్తులు క్యూలైన్‌లో బారులు తీరాల్సిన అవస‌రం ఉండ‌ద‌ని చెప్పింది. నెల రోజుల పాటు ప్ర‌యోగాత్మ‌కంగా అమ‌లు చేయ‌నున్నారు. అలాగే, రోజుకు 500 శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల‌ను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుద‌ల చేసిన‌ట్లు టీడీపీ చెప్పింది. మూడు నెల‌ల అనంత‌రం ఈ విధానంపై స‌మీక్షించి నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు వివ‌రించింది. తిరుప‌తి విమానాశ్ర‌యంలో ప్ర‌తిరోజూ భ‌క్తుల‌కు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం య‌థావిధిగా కొన‌సాగుతుంద‌ని.. భ‌క్తుల‌ను టీటీడీ తీసుకున్న నిర్ణ‌యాన్ని గ‌మ‌నించి.. ఈ మేర‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం ప్ర‌ణాళిక‌లు రూపొందించుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement