Pavitrotsavam | తిరుమలలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ
Pavitrotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.
Devotional | Published On Aug 24, 2026, 7.09 pm IST
Pavitrotsavam | తిరుమల శ్రీవారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం యాగశాలలో హోమాలు, ఇతర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేష అభిషేకం చేశారు. తర్వాత వేదఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులు, జయవిజయులు, గరుడాళ్వారు, వరదరాజస్వామివారు, వకుళమాత అమ్మవారు, ఆనందనిలయం, యాగశాల, విష్వక్సేనులవారు, యోగనరసింహస్వామివారు, భాష్యకార్లు, పోటు తాయారు, ధ్వజస్తంభం, బలిపీఠం, శ్రీభూవరాహస్వామివారు, శ్రీబేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తిరుమలలో పవిత్రోత్సవాలు 15, 16వ శతాబ్దాల వరకు జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1962లో తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉత్సవాలను తిరిగి ప్రారంభించింది. చారిత్రక ఆధారాల ప్రకారం శ్రీవారి ఉత్సవమూర్తులకు సమర్పించే పవిత్రాల కోసం ఉపయోగించే పత్తిని ప్రత్యేకంగా పెంచేవారు. అత్యంత పవిత్రమైన తులసి మొక్కలను పెంచే పెరటి భూమిలోనే శ్రేష్ఠమైన జాతి పత్తి మొక్కలను సాగు చేయడం ఆనవాయితీగా ఉండేది. పవిత్రాల తయారీకి 20 మూరల పట్టుదారం లేదా 200 మూరల నూలుదారం వినియోగిస్తారు. ఈ దారాలకు తెలుపుతో పాటు నలుపు, ఎరుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు అద్దుతారు. కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponguleti | ఫాస్ట్ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి
ఆగస్టు 24, 2026

CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్రెడ్డి
ఆగస్టు 24, 2026

CM Revanth Reddy | ఇది తెలంగాణకు జరిగిన అవమానం.. ముక్తకంఠంతో ఖండించాలని సీఎం రేవంత్ పిలుపు
ఆగస్టు 24, 2026
తాజావార్తలు
- ●Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో
- ●ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? 'శక్తి' జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ
- ●Ponguleti | ఫాస్ట్ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి
- ●MP Dharmapuri Aravind | ఈడ ఉన్నయే బందయెటట్టున్నయంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్స్టిట్యూషన్లు తెస్తడట
- ●Anupama Parameswaran | తెలుగు టీవీ షోకు జడ్జ్గా అనుపమ పరమేశ్వరన్ - జానీ మాస్టర్తో కలిసి!
- ●CM Revanth Reddy | తెలంగాణ రైజింగ్ 2047 అడ్డుకోవడం రాజకీయ వివక్షే : సీఎం రేవంత్రెడ్డి

Telangana ACB Raid | భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం.. ఏసీబీ వలలో ఆలేరు ఆర్ఐ, జీపీవో

ABVP Protest Hyderabad | పాలిటెక్నిక్ కోర్సు వ్యవధి తగ్గిస్తారా? 'శక్తి' జీవో 97పై భగ్గుమన్న ఏబీవీపీ

Ponguleti | ఫాస్ట్ట్రాక్ విధానంలో 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నం : మంత్రి పొంగులేటి

MP Dharmapuri Aravind | ఈడ ఉన్నయే బందయెటట్టున్నయంటే.. ఆన్నుంచి ఇంకేవో ఇన్స్టిట్యూషన్లు తెస్తడట



