Digital Arrest Scam | రూ.27 లక్షల మోసానికి సైబర్ నేరస్థుల ఎర.. మహిళను రక్షించిన బ్యాంకు సిబ్బంది..
Digital Arrest Scam | దేశంలో రోజు రోజుకీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దుండగులు ప్రజలను భయపెట్టి లేదా మోసాలకు గురి చేసి భారీ ఎత్తున డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వాలు, బ్యాంకులు ప్రజలను ఎంత హెచ్చరించినా కొందరు ఇంకా ఈ మోసాల బారిన పడుతున్నారు.
Digital Arrest Scam | దేశంలో రోజు రోజుకీ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దుండగులు ప్రజలను భయపెట్టి లేదా మోసాలకు గురి చేసి భారీ ఎత్తున డబ్బులు కాజేస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వాలు, బ్యాంకులు ప్రజలను ఎంత హెచ్చరించినా కొందరు ఇంకా ఈ మోసాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చిత్రమేమిటంటే బ్యాంకు సిబ్బంది జోక్యంతో అదృష్టవశాత్తూ బాధితురాలు డబ్బులు పోలేదు. ఈ సంఘటన గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచిలో చోటు చేసుకుంది. ఓ వృద్ధ మహిళ రూ.27 లక్షలు నష్టపోకుండా బ్యాంకు సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించి సైబర్ మోసాన్ని అడ్డుకున్నారు.
మహిళ ప్రవర్తనపై అనుమానం..
బ్యాంక్ ఆఫ్ బరోడా సబర్మతి బ్రాంచ్కు ఇటీవల ఓ వృద్ధ మహిళ వచ్చి తన ఫిక్స్డ్ డిపాజిట్లు అన్నింటినీ క్లోజ్ చేసింది. వాటితోపాటు సేవింగ్స్ ఖాతాలో ఉన్న సొమ్ము మొత్తాన్ని ఓ వ్యక్తికి పంపించాలని బ్యాంకు సిబ్బందిని కోరింది. మొత్తం రూ.27 లక్షలను ఆమె పంపించాలనుకున్నట్లు తెలిపింది. అయితే ఆమె ముఖ కవళికలు, ప్రవర్తన, ఆమె నగదు పంపించాలనుకున్న అవతలి వ్యక్తి వివరాలను తెలుసుకున్న బ్యాంకు సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్న హర్షద్ పార్మర్ అనే వ్యక్తి ఆ మహిళ అసాధారణ ప్రవర్తనను గుర్తించి వెంటనే బ్యాంకు మేనేజర్ దిలీప్ చౌహాన్కు విషయం చెప్పాడు. దీంతో ఆయన కలగజేసుకుని ఆమె నుంచి వివరాలను రాబట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆమె ఎలాంటి వివరాలను చెప్పలేదు. కానీ ఏదో మోసం జరగబోతుంది అన్న విషయాన్ని మాత్రం బ్యాంకు సిబ్బంది పసిగట్టారు. దీంతో వారు వెంటనే అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఏసీపీ హార్దిక్ మకాడియా, ఇతర సైబర్ క్రైమ్ సెల్ సిబ్బంది బ్యాంకుకు చేరుకుని విచారణ చేపట్టారు.

డిజిటల్ అరెస్టు స్కాం అని..
అయితే చాలా సేపు ఆ మహిళకు నచ్చజెప్పిన అనంతరం ఆమె అసలు విషయాన్ని తెలియజేసింది. ఆమెకు వాట్సాప్లో ఓ మెసేజ్ వచ్చిందని, కొందరు ఆ మెసేజ్ గురించి కాల్స్ కూడా చేశారని చెప్పింది. ఢిల్లీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పేరిట సీనియర్ అధికారులమని చెబుతూ కొందరు తనకు ఫోన్ కాల్స్ చేశారని ఆమె తెలిపింది. తన ఫోన్ నుంచి పాకిస్థాన్కు భారత ఆర్మీకి చెందిన 21 రహస్యాల వివరాలు, వాటి ఫొటోలు వెళ్లాయని, ఇది రూ.50 కోట్లకు చెందిన స్కామ్ అని చెప్పి తనను భయపెట్టారని ఆ మహిళ పోలీసులకు తెలిపింది. దీంతో అసలు విషయం పసిగట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు అది డిజిటల్ అరెస్టు స్కాం అని చెప్పడంతో ఆ మహిళ ఊపిరి పీల్చుకుంది. ఈ క్రమంలో అప్పటి వరకు ఆమె కాల్ చేసిన దుండగులు కూడా తమ బండారం బయట పడుతుందన్న భయంతో విషయాన్ని పసిగట్టి వెంటనే ఆమెకు కాల్స్ చేయడం ఆపేశారు. దీంతో అదంతా మోసమని ఆ మహిళకు కూడా నిర్దారణ అయింది. ఈ క్రమంలో ఆమె బ్యాంకు సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేసింది.
ఇది 5వ సంఘటన..
ఇక ఇలాంటి స్కామ్లు జరగడం ఇదేమీ కొత్త కాదు. ఇప్పటి వరకు చాలా మంది బాధితులు ఇలాంటి మోసాల్లో కొన్ని కోట్ల రూపాయలను పోగొట్టుకున్నారు. అయితే ఈ సంఘటనలో మాత్రం బ్యాంకు సిబ్బంది అలర్ట్ అయి ఆ మహిళ డబ్బు నష్టపోకుండా రక్షించారు. కాగా ఈ నెలలో ఇలా బ్యాంకు సిబ్బంది అలర్ట్ అయి బాధితులను రక్షించడం ఇది 5వ సారని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అసలు ఫోన్లో అరెస్టు చేయడం ఉండదని, ఏదైనా సమస్య ఉంటే అధికారులు లేదా పోలీసులు నేరుగా నిందితులు లేద బాధితుల ఇళ్లకు వస్తారని, కనుక ఇలా ఎవరైనా ఫోన్ చేస్తే నమ్మవద్దని పోలీసులు హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్వర్క్పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

VC Sajjanar | మెడికల్ సీట్ల పేరుతో మోసాలు.. తల్లిదండ్రులారా జాగ్రత్త!
మే 2, 2026

bob World Lite | 4జి ఫీచర్ ఫోన్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్.. ఇక చెల్లింపులు ఎంతో సులభం..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



