Leap India IPO | రేపటి నుంచే లీప్ ఇండియా ఐపీఓ.. పెట్టుబడి పెట్టవచ్చా..?
Leap India IPO | భారత్లో అతిపెద్ద ఆన్ డిమాండ్ అసెట్ పూలింగ్ సంస్థలలో ఒకటైన లీప్ ఇండియా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఆగస్టు 7 నుంచి పెట్టుబడిదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఐపీఓ ఆగస్టు 11 వరకు సబ్స్క్రిప్షన్కు ఓపెన్ ఉంటుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.151 నుంచి రూ.159 వరకు ప్రైస్ బ్యాండ్ను నిర్ణయించింది.
Leap India IPO | భారత్లో అతిపెద్ద ఆన్ డిమాండ్ అసెట్ పూలింగ్ సంస్థలలో ఒకటైన లీప్ ఇండియా లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఆగస్టు 7 నుంచి పెట్టుబడిదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఐపీఓ ఆగస్టు 11 వరకు సబ్స్క్రిప్షన్కు ఓపెన్ ఉంటుంది. కంపెనీ ఒక్కో షేరుకు రూ.151 నుంచి రూ.159 వరకు ప్రైస్ బ్యాండ్ను నిర్ణయించింది. మొత్తం రూ.2,480 కోట్ల విలువైన ఈ ఐపీఓలో తాజా ఈక్విటీ షేర్ల జారీతోపాటు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కూడా ఉంది. ఇందులో 3.01 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుండగా, ఇప్పటికే ఉన్న వాటాదారులు 12.5 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్ఎస్ ద్వారా విక్రయించే షేర్ల నుంచి వచ్చే ఆదాయం కంపెనీకి కాకుండా ప్రస్తుత వాటాదారులకే వెళ్తుంది. బ్రోకరేజ్ సంస్థలు ఈ ఐపీఓపై న్యూట్రల్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కంపెనీకి బలమైన వ్యాపార నమూనా, విభిన్న రంగాలకు చెందిన కస్టమర్ బేస్ ఉన్నప్పటికీ, కొన్ని ఆర్థిక అంశాలపై జాగ్రత్త అవసరమని పేర్కొన్నాయి.
న్యూట్రల్ రేటింగ్ ఇచ్చిన ఎస్బీఐ..
ఎస్బీఐ సెక్యూరిటీస్ తెలిపిన ప్రకారం.. లీప్ ఇండియా దేశంలో అతిపెద్ద ఆన్ డిమాండ్ అసెట్ పూలింగ్ సేవల సంస్థగా ఉంది. ప్యాలెట్లు, కంటైనర్లు, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ (ఎంహెచ్ఈ) వంటి పరికరాలను వివిధ పరిశ్రమలకు అద్దె, పూలింగ్ విధానంలో అందిస్తోంది. కొనుగోలు, వినియోగం, డిజిటల్ ట్రాకింగ్, తిరిగి సేకరణ, మరమ్మత్తులు, నిర్వహణ, మళ్లీ వినియోగంలోకి తీసుకురావడం వరకు మొత్తం అసెట్ జీవితచక్రాన్ని కంపెనీ నిర్వహిస్తుంది. దీంతో కస్టమర్లు సొంతంగా ఈ పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా సరఫరా గొలుసు మౌలిక సదుపాయాలను వినియోగించుకోవచ్చు. అయితే కంపెనీ వ్యాపారం అధిక వర్కింగ్ క్యాపిటల్పై ఆధారపడుతోందని ఎస్బీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ముఖ్యంగా 131 రోజుల రిసీవబుల్ పీరియడ్ ఉండటం నగదు ప్రవాహంపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల కంపెనీ లిస్టింగ్ అనంతరం కొన్ని త్రైమాసికాల పనితీరును గమనించిన తర్వాతే స్పష్టమైన పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది.
స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ సైతం..
స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అసెట్ పూలింగ్ రంగంలో కంపెనీకి బలమైన నాయకత్వ స్థానం ఉందని, ఈ రంగంలో ప్రవేశ అడ్డంకులు ఎక్కువగా ఉండటంతో లీప్ ఇండియాకు పోటీ తక్కువగా ఉంటుందని తెలిపింది. భారత్లో ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని ప్యాలెట్ పూలింగ్ మార్కెట్ నుంచి కంపెనీ ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అయితే తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం ఈ ఐపీఓ విలువ అధికంగా ఉందని స్వస్తిక అభిప్రాయపడింది. కంపెనీ వర్చువల్ మోనోపలీ తరహా వ్యాపార నమూనా కారణంగా అధిక ప్రీమియం కోరుతోందని, కానీ ప్రస్తుత విలువలు, పరిమిత రాబడి నిష్పత్తులను పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడిదారులకు రిస్క్ రివార్డ్ అనుకూలంగా కనిపించడం లేదని పేర్కొంది. అలాగే కస్టమర్లు ఒప్పందాలను పునరుద్ధరించకపోవడం లేదా మధ్యలోనే రద్దు చేసుకోవడం నగదు ప్రవాహంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ కారణాలతో స్వస్తిక కూడా న్యూట్రల్ రేటింగ్ ఇచ్చింది.
గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత..
గ్రే మార్కెట్లో లీప్ ఇండియా షేర్లకు స్వల్ప ప్రీమియం కనిపిస్తోంది. షేరు రూ.165.50 వద్ద ట్రేడవుతూ, గరిష్ఠ ప్రైస్ బ్యాండ్ రూ.159తో పోలిస్తే రూ.6.50 (4.09 శాతం) ప్రీమియంతో కొనసాగుతోంది. ఈ ఐపీఓలో పెట్టుబడిదారులు కనీసం 94 ఈక్విటీ షేర్లకు, ఆ తర్వాత అదే సంఖ్యలో గుణింతాల రూపంలో బిడ్ చేయవచ్చు. ఇష్యూలో 50 శాతం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీలు) కోసం, 15 శాతం నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్ఐఐలు) కోసం, మిగిలిన 35 శాతం రిటైల్ పెట్టుబడిదారుల కోసం కేటాయించారు. లీప్ ఇండియా షేర్లు ఆగస్టు 14న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ స్టాక్ ఎక్స్చేంజ్లలో లిస్ట్ కానున్నాయి. ఈ ఐపీఓకు జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్గా, ఎంయూఎఫ్జీ ఇంటైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రార్గా వ్యవహరిస్తున్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Kapur Family | మధ్యవర్తిత్వం విఫలమైతే.. సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- ●BRS Leaders | జయశంకర్ సార్ చెప్పినట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలే
- ●WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..
- ●Congress survey | ఇప్పుడే ఎన్నికలొస్తే బీఆర్ ఎస్ క్లీన్ స్వీప్.. నిగ్గు తేల్చిన కాంగ్రెస్ సర్వే
- ●Jairam Ramesh | ఈ20 ఇంధనం పర్యావరణానికి అనుకూలం కాదు : జైరామ్ రమేష్
- ●ETF | ఈటీఎఫ్ వర్సెస్ మ్యుచువల్ ఫండ్స్.. పెట్టుబడికి ఏది బెస్ట్..?

Kapur Family | మధ్యవర్తిత్వం విఫలమైతే.. సంజయ్ కపూర్ కుటుంబ ట్రస్టు కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

BRS Leaders | జయశంకర్ సార్ చెప్పినట్టు మాట్లాడితే.. అసెంబ్లీ ఇటుకలు సైతం జై తెలంగాణ అనక తప్పలే

WhatsApp | వాట్సాప్ గ్రూప్ చాట్స్లో భారీ మార్పులు.. పోల్స్, ఎట్ ఆల్, కొత్త గ్రూప్ ఫీచర్లు అందుబాటులోకి..

Congress survey | ఇప్పుడే ఎన్నికలొస్తే బీఆర్ ఎస్ క్లీన్ స్వీప్.. నిగ్గు తేల్చిన కాంగ్రెస్ సర్వే




