Digital Payments | RTGS, NEFT మధ్య అసలు తేడా ఏమిటి.. ఏది ఎలా పనిచేస్తుంది..?
Digital Payments | దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో నడిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా దేశంలో అత్యధిక లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ఇందులో నగదు ట్రాన్స్ఫర్కు పరిమితులు ఉంటాయి.
Digital Payments | దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రస్తుతం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఆధ్వర్యంలో నడిచే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ద్వారా దేశంలో అత్యధిక లావాదేవీలు జరుగుతున్నప్పటికీ ఇందులో నగదు ట్రాన్స్ఫర్కు పరిమితులు ఉంటాయి. కనుక అధిక మొత్తాల లావాదేవీల కోసం ప్రజలు ఇప్పటికీ సంప్రదాయ డిజిటల్ చెల్లింపు పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలను విస్తరిస్తున్న నేపథ్యంలో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), ఇమిడియేట్ పేమెంట్ సర్వీస్ (IMPS) వంటి డిజిటల్ లావాదేవీ సెటిల్మెంట్ వ్యవస్థలు ఇప్పుడు మొబైల్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆఫ్లైన్ లావాదేవీలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అయితే ప్రతి సెటిల్మెంట్ వ్యవస్థకు కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.
RTGS అంటే..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2004 మార్చిలో RTGS చెల్లింపు సెటిల్మెంట్ వ్యవస్థను ప్రారంభించింది. ప్రారంభంలో ఈ వ్యవస్థ బ్యాంకుల మధ్య నిధుల బదిలీ కోసం మాత్రమే ఉపయోగించబడేది. తరువాత 2004 ఆగస్టులో ఒక కస్టమర్ బ్యాంక్ ఖాతా నుంచి మరో కస్టమర్ బ్యాంక్ ఖాతాకు నేరుగా చెల్లింపులు జరపడానికి కూడా RTGS సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దేశంలో సాధారణంగా రూ.2 లక్షలకు పైబడిన అధిక మొత్తాల లావాదేవీల కోసం RTGS వ్యవస్థను ఉపయోగిస్తారు. ఒకసారి లావాదేవీ పూర్తయిన తర్వాత తేడాలు రాకుండా ఉండేందుకు రిజర్వ్ బ్యాంక్ తన ఖాతాల్లోనే ఆ బదిలీని నమోదు చేస్తుంది. ఆర్టీజీఎస్ వల్ల ఎంత పెద్ద మొత్తంలో నగదును అయినా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. దీనికి గరిష్ట పరిమితి లేదు. ఇది సురక్షితమైన నిధుల బదిలీ వ్యవస్థ అని RBI పేర్కొంటోంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్ల ద్వారా ఈ సేవ అందుబాటులో ఉంటుంది.
బ్యాంక్ శాఖను సందర్శించి చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా కూడా లావాదేవీలు ప్రారంభించవచ్చు. నిధులు స్వీకరించడానికి బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేదు. నగదు లావాదేవీలు లేకపోవడం వల్ల ఆర్థిక నష్టం లేదా దొంగతనం గురించి ఆందోళన అవసరం ఉండదు. మోసపూరిత ఉపసంహరణలు జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బ్యాంకులు వసూలు చేసే ట్రాన్స్ఫర్ ఛార్జీలకు గరిష్ఠ పరిమితి ఉంటుంది. RTGS లావాదేవీలకు చట్టపరమైన రక్షణ కూడా కల్పించారు.

NEFT అంటే..
రిజర్వ్ బ్యాంక్ 2005లో NEFT వ్యవస్థను ప్రారంభించింది. ఇది వినియోగదారులు ఒకరి ఖాతా నుంచి మరొకరి ఖాతాకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే మరో చెల్లింపు సెటిల్మెంట్ విధానం. ఇది RBI నిర్వహించే దేశవ్యాప్తంగా పనిచేసే కేంద్రీకృత చెల్లింపు వ్యవస్థ. RTGSతో పోలిస్తే తక్కువ మొత్తాల లావాదేవీల కోసం NEFT సాధారణంగా ఉపయోగపడుతుంది. NEFT సేవ ప్రధానంగా ఆన్లైన్ లావాదేవీల కోసం పనిచేస్తుంది. మొబైల్ బ్యాంకింగ్ యాప్లు లేదా ల్యాప్టాప్/పీసీ ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పోర్టల్లలో ఈ సేవను వినియోగించవచ్చు. అలాగే EMIలు చెల్లించడానికి లేదా ఇతర రుణాలను తిరిగి చెల్లించడానికి కూడా NEFT ఉపయోగపడుతుంది. RTGS మాదిరిగానే NEFT కూడా సంవత్సరమంతా రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. బెనిఫిషియరీ ఖాతాకు దాదాపు రియల్ టైమ్లో నిధుల బదిలీ జరుగుతుంది.
NEFT కూడా సురక్షితమైన నిధుల బదిలీ విధానం కాగా దీనికి కూడా RBI చట్టపరమైన రక్షణ కల్పించింది. దేశవ్యాప్తంగా అన్ని రకాల బ్యాంకులకు డబ్బు బదిలీ చేయడానికి ఇది అనుమతిస్తుంది. బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే డబ్బు పంపించవచ్చు.
బ్యాంకు ఆధారంగా ట్రాన్స్ఫర్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. సేవింగ్స్ ఖాతా నుంచి ఆన్లైన్ NEFT లావాదేవీలకు సాధారణంగా ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఈ సేవ ద్వారా నేపాల్కు కూడా డబ్బు బదిలీ చేయవచ్చు.
RTGS, NEFT మధ్య ముఖ్యమైన తేడాలు..
RTGS ద్వారా రూ.10 లక్షల లోపు లావాదేవీలు వెంటనే పూర్తవుతాయి. NEFT ద్వారా దాదాపు రియల్ టైమ్ సెటిల్మెంట్ ఉంటుంది. లావాదేవీ కొన్ని గంటల్లో పూర్తవుతుంది. RTGS ద్వారా నగదును పంపించాలంటే కనీస లావాదేవీ పరిమితి రూ.2 లక్షలు కాగా గరిష్ఠ పరిమితి లేదు. NEFT లో కనీస లావాదేవీ పరిమితి లేదు. అయితే కొన్ని బ్యాంకులు తమకు అనుకూలంగా గరిష్ఠ పరిమితిని నిర్ణయించవచ్చు. కాబట్టి లావాదేవీ ప్రారంభించే ముందు బ్యాంకును సంప్రదించడం మంచిది. RTGS లో లావాదేవీ మొత్తాన్ని బట్టి బ్యాంకులు రూ.25 నుంచి రూ.50 వరకు ఛార్జీలు వసూలు చేస్తాయి. NEFT లావాదేవీ మొత్తాన్ని బట్టి రూ.2.50 నుంచి రూ.25 వరకు ఛార్జీలు ఉంటాయి. NEFT, RTGS సేవలు సంవత్సరంలో అన్ని రోజులు, రోజుకు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. ఇందులో బ్యాంక్ సెలవులు, ప్రభుత్వ సెలవులు కూడా ఉంటాయి. NEFT ద్వారా సాధారణంగా రూ.2 లక్షల వరకు గరిష్ట మొత్తాన్ని బదిలీ చేయవచ్చు. NEFT, RTGS సేవలు సంవత్సరమంతా అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటాయి. అయితే బ్యాంక్ శాఖకు వెళ్లి RTGS లావాదేవీ ప్రారంభించడం మాత్రం బ్యాంక్ సెలవు రోజుల్లో సాధ్యం కాదు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






