త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maruti Suzuki WagonR E85 | పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మారుతీ సుజుకి సంచలన నిర్ణయం. 85% ఇథనాల్‌తో నడిచే దేశపు మొట్టమొదటి వాగన్‌ఆర్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును భారత్‌లో ఆవిష్కరించింది.

J

Automobiles | Published On Jun 4, 2026, 3.19 pm IST

Maruti Suzuki WagonR E85 | పెట్రోల్ భారం ఇక తప్పుతుందా? 85% ఇథనాల్‌తో నడిచే తొలి కారు వచ్చేసింది!
Advertisement
  • మారుతీ సుజుకి దేశంలోనే తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు 'వాగన్‌ఆర్' (WagonR)ను లాంచ్ చేసింది.
  • ఈ సరికొత్త కారు E85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) ఇంధనంతో నడుస్తుంది.
  • కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్‌దీప్ సింగ్ పూరీలు ఈ కారును ఆవిష్కరించారు.
  • దీనివల్ల వాహన కాలుష్యం తగ్గడమే కాకుండా, పెట్రోల్ దిగుమతులపై భారం తగ్గుతుంది.

Maruti Suzuki WagonR E85 | త్రినేత్ర.న్యూస్ : మారుతీ సుజుకి (Maruti Suzuki) కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్! ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా దేశంలోనే మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారును కంపెనీ ఆవిష్కరించింది. భారత ఆటోమొబైల్ రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీస్తూ, ఫేవరెట్ ఫ్యామిలీ కారు 'వాగన్‌ఆర్' (WagonR)ను E85 ఇథనాల్‌తో నడిచేలా రూపొందించింది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari), పెట్రోలియం మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ సమక్షంలో ఈ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

సాధారణ కారుకు దీనికి తేడా ఏంటి?

సాధారణ పెట్రోల్ కార్లతో పోలిస్తే, ఈ కొత్త వాగన్‌ఆర్ E85 ఫ్యూయల్‌తో నడుస్తుంది. అంటే ఇందులో 85 శాతం ఇథనాల్ (Ethanol), కేవలం 15 శాతం మాత్రమే పెట్రోల్ వాడుతారు. దీనికోసం రెగ్యులర్ పెట్రోల్ మోడల్‌లో అనేక హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్స్ (Upgrades) చేశారు. ఇథనాల్‌ను తట్టుకునేలా ప్రత్యేకమైన ఫ్యూయల్ డెలివరీ కాంపోనెంట్స్, కొత్త ఇంజిన్ కాలిబ్రేషన్ సిస్టమ్‌ను ఇందులో పొందుపరిచారు. పవర్‌ట్రెయిన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఎప్పటికప్పుడు ఇథనాల్ శాతాన్ని బట్టి ఇంజిన్ పర్ఫార్మెన్స్ (Performance) తగ్గకుండా చూసుకుంటుంది.

పెట్రోల్ ఖర్చుకు చెక్.. రైతులకు అండ

మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బడ్జెట్ కార్లలో వాగన్‌ఆర్ ముందువరుసలో ఉంటుంది. అలాంటి కారులో ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex Fuel) టెక్నాలజీ తీసుకురావడం సామాన్యులకు పెద్ద ఊరట అని చెప్పొచ్చు. ఈ లాంచ్ ఈవెంట్‌లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, "ప్రతి ఏటా మనం విదేశాల నుంచి భారీగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇథనాల్ వాడకం వల్ల ఆ దిగుమతుల భారం తగ్గడమే కాకుండా, ఇథనాల్ ఉత్పత్తితో మన రైతులకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది" అని అన్నారు. మారుతీ సుజుకి తీసుకున్న ఈ అద్భుతమైన చొరవను ఆయన ప్రశంసించారు.

Maruti Suzuki WagonR E85 India's First Flex-Fuel Car Unveiled

మరో కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ స్పందిస్తూ.. "మోదీ ప్రభుత్వ హయాంలో రైతులు కేవలం 'అన్నదాతలు'గానే కాకుండా 'ఊర్జదాతలు'గా (శక్తి ప్రదాతలు) మారుతున్నారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వల్ల వాయు కాలుష్యం (Tailpipe emissions) తగ్గడంతో పాటు వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది" అని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మిగతా ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లను మార్కెట్లోకి తీసుకొస్తాయని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement