Ratnachal Express | రత్నాచల్ ఎక్స్ప్రెస్కు ఎల్హెచ్బీ బోగీలు..!
Ratnachal Express | విజయవాడ–విశాఖపట్నం మధ్య ప్రతిరోజూ నడిచే రత్నాచల్ ఎక్స్ప్రెస్లో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి.
Andhra pradesh | Published On Feb 23, 2026, 9.15 pm IST
Ratnachal Express | విజయవాడ–విశాఖపట్నం మధ్య ప్రతిరోజూ నడిచే రత్నాచల్ ఎక్స్ప్రెస్లో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పులు మంగళవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు మరింత భద్రత, సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం రైలుకు ఐసీఎఫ్ కోచ్లు వినియోగిస్తుంది.
వాటి స్థానంలో ఆధునిక సదుపాయాలతో కూడిన ఎల్హెచ్బీ (లింక్ హాఫ్మన్ బుష్) కోచ్లను అమర్చనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఎల్హెచ్బీ బోగీలు భద్రతాపరంగా మెరుగ్గా ఉంటాయి. వేగానికి అనుకూలంగా ఉండటంతో పాటు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేస్తాయి. రేపటి నుంచి ఈ కొత్త కోచ్ వ్యవస్థ అమలులోకి రానున్నందున, రత్నాచల్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించే వారంతా కోచ్ల మార్పును గమనించాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఇక ఇప్పటి వరకు రైలులో 24 బోగీలు ఉన్నాయి.
అందులో 18 చైర్ కార్లు, మూడు ఏసీ చైర్ కార్లు, ఒక ప్యాంట్రీ కార్, 2 సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల కోచ్లు ఉన్నాయి. మార్పుల తర్వాత మొత్తం బోగీల సంఖ్య 22కి తగ్గనుంది. కొత్త కూర్పులో 12 చైర్ కార్లు, 3 థర్డ్ ఏసీ చైర్ కార్స్, ఒక ప్యాంట్రీ కార్, నాలుగు జనరల్ కోచ్లు, రెండు సెకండ్ క్లాస్ లగేజ్ కమ్ దివ్యాంగుల బోగీలు ఉండనున్నాయి. అంటే ఇప్పటివరకు ఉన్న 18 చైర్ కార్ల స్థానంలో ఇకపై 12 మాత్రమే ఉంటాయి. వాటి బదులుగా 4 జనరల్ కోచ్లను చేర్చింది. సాధారణ ప్రయాణికులకు కొంత ఉపశమనం లభించనున్నది. అయితే, మొత్తం కోచుల్లో రెండు తగ్గనున్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



