త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ahmedabad Bank Robbery | భారీ బ్యాంక్ రాబరీ: చెత్త బాక్సులో రూ.8.70 కోట్లు.. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవుతుందనుకుంటే.. అడ్డంగా దొరికిపోయాడు!

అహ్మదాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ చోరీ. చెత్త పడేస్తున్నానని చెప్పి ఏకంగా రూ.8.7 కోట్లతో ఉడాయించాడు ఓ ఉద్యోగి. 90 రోజుల తర్వాత అతడు ఎలా దొరికాడంటే?

J

Viral news | Published On May 25, 2026, 6.40 pm IST

Ahmedabad Bank Robbery | భారీ బ్యాంక్ రాబరీ: చెత్త బాక్సులో రూ.8.70 కోట్లు.. సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అవుతుందనుకుంటే.. అడ్డంగా దొరికిపోయాడు!
Advertisement

Ahmedabad Bank Robbery | త్రినేత్ర.న్యూస్ : అహ్మదాబాద్‌ (Ahmedabad) నగరంలో ఓ భారీ చోరీ వెలుగులోకి వచ్చింది. గాంధీ రోడ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడాకు (Bank of Baroda) చెందిన ఆర్‌బీఐ కరెన్సీ చెస్ట్ (RBI Currency Chest) నుంచి ఏకంగా రూ.8.70 కోట్లు మాయమయ్యాయి. కంచె చేను మేసిన చందంగా.. గత 15 ఏళ్లుగా అదే బ్యాంకులో జాయింట్ కస్టోడియన్‌గా పనిచేస్తున్న ఉద్యోగి హర్సిద్ధ్ కడియార్ ఈ భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. తాజాగా ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV footage) బయటకు రావడంతో అసలు బాగోతం బట్టబయలైంది.

చెత్త బాక్సులో కోట్లు

లగ్జరీ లైఫ్‌కు (Luxurious lifestyle) అలవాటు పడిన హర్సిద్ధ్ ఎలాగైనా రాత్రికి రాత్రే కోటీశ్వరుడు కావాలనుకున్నాడు. అందుకోసం పక్కా ప్లాన్ వేశాడు. 2026 జనవరి 13వ తేదీ రాత్రి బ్యాంకులోని సెక్యూరిటీ సిబ్బందిని బురిడీ కొట్టించాడు. బ్యాంకులో ఉన్న పాత చెత్తను, స్క్రాప్‌ను (Scrap material) బయట పడేయడానికి వెళ్తున్నానని చెప్పి.. ఒక పెద్ద అట్టపెట్టెను తీసుకుని బయటకు వచ్చాడు. కానీ ఆ బాక్సులో చెత్తకు బదులు ఏకంగా రూ.8.70 కోట్ల కరెన్సీని నింపాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే కరెన్సీ చెస్ట్ నుంచి ఎవరికీ ఏమాత్రం అనుమానం రాకుండా ఆ క్యాష్ బాక్సుతో దర్జాగా బయటకు నడిచాడు.

ఆ ఒక్క కన్ఫ్యూజన్‌తో దొరికిపోయాడు

ఇక్కడే కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటుచేసుకుంది. బ్యాంకులోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో రికార్డ్ అయిన ఫుటేజ్ అంతా సరిగ్గా 90 రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలీట్ అయిపోతుందని నిందితుడు భావించాడు. అందుకే ఎవరికీ అనుమానం రాకుండా, తాను చోరీ చేసిన మరుసటి రోజు నుంచి 3 నెలల పాటు రోజూ మామూలుగానే బ్యాంకుకు వచ్చి తన డ్యూటీ (Duty) తాను చేసుకుంటూ పోయాడు. తన ప్లాన్ పర్ఫెక్ట్‌గా వర్కవుట్ అయిందని, ఇక తాను సేఫ్ అని సంబరపడిపోయాడు.

అడ్డంగా బుక్కయ్యాడు

అయితే, నిందితుడి ఆశలు ఎక్కువ కాలం నిలవలేదు. పోలీసులు ఎట్టకేలకు సీసీటీవీ ఫుటేజ్‌ను రికవర్ చేశారు. ఆ ఫుటేజ్ ఈ కేసులో ఇప్పుడు అత్యంత కీలక సాక్ష్యంగా (Crucial evidence) మారింది. దీని ఆధారంగా ప్రధాన నిందితుడిగా హర్సిద్ధ్‌ను గుర్తించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) ముమ్మరం చేశారు. ఇంత పెద్ద స్కెచ్ వేసిన ఆ ఉద్యోగికి బ్యాంకులో గానీ, బయట గానీ ఇంకెవరైనా సాయం చేశారా? చోరీ చేసిన ఆ రూ.8.70 కోట్ల క్యాష్‌ను ఎక్కడ దాచాడు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
Advertisement