త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్

ఐఫోన్ ఈఎంఐ కోసం తలెత్తిన వివాదం ఆ కుటుంబంలో పెను విషాదం నింపింది. మహారాష్ట్రలో కొండపై నుంచి పడి ముగ్గురు మృతి చెందగా, తల్లి చివరి వీడియో వైరల్ అవుతోంది.

J

Viral news | Published On Aug 23, 2026, 3.47 pm IST

Maharashtra Hill Tragedy | ఐఫోన్ EMI గొడవతో కొండపై నుంచి పడి కుటుంబం బలి.. తల్లి చివరి వీడియో వైరల్

సంక్షిప్త సారాంశం

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కొండపై నుంచి లోయలో పడి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడు కొనుగోలు చేసిన కొత్త ఐఫోన్ ఈఎంఐ (EMI) చెల్లింపుల విషయంలో తలెత్తిన గొడవే ఈ విషాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. చనిపోవడానికి సరిగ్గా ఒకరోజు ముందు, బంధాల (Relationships) గురించి తల్లి సంగీత తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. గతంలోనూ ఆ యువకుడు ఇదే కొండ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా, అప్పట్లో పోలీసులు రక్షించారు.

Advertisement

Maharashtra Hill Tragedy | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో (Chhatrapati Sambhajinagar) శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చిన్నపాటి ఆర్థిక వివాదం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలితీసుకుంది. 48 ఏళ్ల మురళీధర్ చంద్‌గుడే, ఆయన భార్య సంగీత, 18 ఏళ్ల కుమారుడు కునాల్.. 'కోహెడ్య డోంగర్' అనే 250 అడుగుల ఎత్తైన కొండపై నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ముందు తల్లి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది.

Maharashtra Tragedy Mother's Viral Video Before Falling From Hill

ఐఫోన్ ఈఎంఐ కోసం గొడవ.. ఆపై లోయలోకి

పోలీసుల వివరాల ప్రకారం.. కునాల్ ఇటీవల ఒక కొత్త ఐఫోన్ కొనుగోలు చేశాడు. దాని ఈఎంఐ (EMI) కట్టడానికి డబ్బులు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఆ కోపంలో శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో కొండ పైకి ఎక్కాడు. విషయం తెలుసుకున్న తండ్రి మురళీధర్, అతన్ని కాపాడేందుకు స్థానికులతో కలిసి అక్కడికి చేరుకున్నారు. సుమారు మూడు గంటల పాటు కుమారుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరకు అతన్ని పట్టుకుని వెనక్కి లాగేందుకు మురళీధర్ ప్రయత్నించగా, ఇద్దరూ బ్యాలెన్స్ తప్పి 250 అడుగుల లోయలో పడిపోయారు. కళ్లముందే భర్త, బిడ్డ పడిపోవడం చూసిన సంగీత తట్టుకోలేకపోయారు. ఆ క్షణంలోనే ఆమె కూడా లోయలోకి దూకేశారు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు.

Maharashtra Tragedy Mother's Viral Video Before Falling From Hill

వైరల్ అవుతున్న తల్లి చివరి వీడియో

ఈ విషాద ఘటన జరగడానికి సరిగ్గా ఒక్కరోజు ముందు గురువారం నాడు, తల్లి సంగీత తన యూట్యూబ్ ఛానెల్‌లో (YouTube channel) పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ప్రేమకు, బంధాలకు (Relationships) విలువ ఇవ్వని వ్యక్తుల కోసం ఏదైనా చేయడంలో అర్థం లేదని ఆ వీడియోలో ఆమె మరాఠీలో పేర్కొన్నారు. "రెండు వైపులా కాలితేనే చపాతీ రుచిగా ఉంటుంది. బంధాలు కూడా అంతే. ఇద్దరూ విలువనిస్తేనే ఆ బంధంలో ఉండాలి, లేదంటే బయటకు వచ్చేయడమే మంచిది" అని ఆమె ఆ వీడియోలో చెప్పారు.

యూట్యూబ్‌లో మోటివేషనల్ వీడియోలు..

సంగీతకు యూట్యూబ్‌లో 29 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె తరచుగా ఫ్యామిలీ ఇష్యూస్, మోటివేషనల్ వీడియోలు, కొడుకుతో కలిసి వ్లాగ్స్ (Vlogs) పోస్ట్ చేసేవారు. ఆరేళ్ల క్రితం పెద్ద కుమారుడు అనారోగ్యంతో చనిపోవడంతో, అప్పటినుంచి భర్తకు ఆమె దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కాగా, గతేడాది కూడా కునాల్ ఇదే కొండ పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించగా, పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి కాపాడారు. కానీ ఈసారి విధి మరోలా తలచడంతో ఆ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

Advertisement
Advertisement