త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Yadadri | భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ఇక ఆ రెండు జిల్లాల భ‌క్త‌జ‌నం చెంత‌కే యాదాద్రీశుడు

Yadadri | తెలంగాణ తిరుప‌తిగా ప్ర‌సిద్ధి గాంచిన యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహా ఆల‌యానికి రోజురోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరిగిపోతోంది. శ‌ని, ఆదివారాల్లో అయితే యాదాద్రి ఆల‌యానికి భారీ సంఖ్య‌లో భ‌క్తులు పోటెత్తుతున్నారు.

S

Telangana | Published On Dec 9, 2025, 5.01 pm IST

Yadadri | భ‌క్తుల‌కు శుభ‌వార్త‌.. ఇక ఆ రెండు జిల్లాల భ‌క్త‌జ‌నం చెంత‌కే యాదాద్రీశుడు
Advertisement

Yadadri | యాదాద్రి భువ‌న‌గిరి : తెలంగాణ తిరుప‌తిగా ప్ర‌సిద్ధి గాంచిన యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహా ఆల‌యానికి రోజురోజుకు భ‌క్తుల ర‌ద్దీ పెరిగిపోతోంది. శ‌ని, ఆదివారాల్లో అయితే యాదాద్రి ఆల‌యానికి భారీ సంఖ్య‌లో భ‌క్తులు పోటెత్తుతున్నారు. యాదాద్రీశుడి ద‌ర్శ‌నం కోసం భ‌క్త‌జ‌నం బారులు తీరుతున్నారు. అయితే స్వామి వారిని ద‌ర్శించుకోలేని భ‌క్తుల‌కు ఆల‌య అధికారులు శుభ‌వార్త వినిపించారు. యాదాద్రి ఆల‌యానికి త‌క్కువ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్న ఆయా జిల్లాల భ‌క్తుల చెంత‌కే యాదాద్రీశుడిని తీసుకెళ్లాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

ప్ర‌స్తుతం నాగ‌ర్‌క‌ర్నూల్, భూపాల‌ప‌ల్లి జిల్లాల నుంచి భ‌క్తులు యాదాద్రికి త‌క్కువ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్నారు. ఈ రెండు జిల్లాల భ‌క్తుల‌కు ప్ర‌చార ర‌థం ద్వారా శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామి ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. ఈ క్ర‌మంలో డిసెంబ‌ర్ 20వ తేదీన భూపాల‌ప‌ల్లి, 27న నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లో స్వామి వారి క‌ల్యాణోత్స‌వ వేడుక‌ల‌ను నిర్వ‌హించేందుకు స‌ర్వం సిద్ధం చేశారు. ఈ వేడుక‌ల్లో భాగంగా స్వామి అమ్మ‌వార్ల క‌ల్యాణోత్స‌వం, ఇత‌ర పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు. అనంత‌రం భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం క‌ల్పించి, తీర్థ ప్ర‌సాదాలు అంద‌జేయ‌నున్నారు.

యాదాద్రి శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహస్వామి త‌మ చెంత‌కే వ‌స్తున్నాడ‌న్న విష‌యం తెలుసుకుని నాగ‌ర్‌క‌ర్నూల్, భూపాల‌ప‌ల్లి జిల్లాల భ‌క్తులు త‌న్మ‌య‌త్వం చెందుతున్నారు. స్వామి వారి ద‌ర్శ‌నం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక త‌మ క‌ష్టాలు తీరుతాయ‌ని, త‌మ‌కు ఎల్ల‌ప్పుడూ ఆ ల‌క్ష్మీన‌ర‌సింహ స్వామి ర‌క్ష‌ణ నిలుస్తాడ‌ని భ‌క్తులు స్మ‌రించుకుంటున్నారు. మొత్తానికి ఈ రెండు జిల్లాల్లో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

తాజావార్తలు

Advertisement