Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
Uttam Kumar Reddy | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. జల్శక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరాలని సూచించారు.
Uttam Kumar Reddy | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భవిష్యత్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వానికి వెంటనే సమగ్ర నివేదిక పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. జల్శక్తి మంత్రిత్వ శాఖ, జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) నుంచి స్పష్టమైన సాంకేతిక మార్గదర్శకాలు కోరాలని సూచించారు. శుక్రవారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఎన్డీఎస్ఏ సూచనల మేరకే ఇప్పటి వరకు మూడు బ్యారేజీలను ఫ్రీ-ఫ్లో విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. భవిష్యత్లో నీటి నిల్వ, పంపింగ్ అంశాలపై రాజకీయాలు లేదా ఊహాగానాల ఆధారంగా కాకుండా, నిపుణుల లిఖితపూర్వక సిఫారసులు, పూర్తి సాంకేతిక నివేదికల ఆధారంగానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
జల్శక్తి మంత్రిత్వ శాఖకు పంపే నివేదికలో ఎన్డీఎస్ఏ సిఫారసులు, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదికలు, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల ఫలితాలు, రాఫ్ట్ ఫౌండేషన్ కింద గుర్తించిన ఖాళీల (క్యావిటీస్) వివరాలతో పాటు అన్ని సాంకేతిక ఆధారాలను జతచేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అన్నారం బ్యారేజీ రాఫ్ట్ ఫౌండేషన్ కింద కూడా క్యావిటీస్ ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ నీటిని నిల్వ చేయడం సురక్షితం కాదని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ కాన్సెప్ట్ డిజైన్ ఈ నెలాఖరులోగా, ప్రాథమిక వ్యయ అంచనాలు సెప్టెంబర్ మధ్య నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని వివరించారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అదనపు సాంకేతిక విశ్లేషణలు మరో రెండు వారాల్లో పూర్తికానున్నట్లు తెలిపారు.
ప్రస్తుత వర్షాకాలంలో కేవలం నీరు ప్రవహిస్తోందనే కారణంతో పంపింగ్ చేపట్టడం సాధ్యం కాదని, తగిన నీటి మట్టం లేకుండా పంపింగ్కు ప్రయత్నిస్తే నిర్మాణ సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ప్రతి నిర్ణయం శాస్త్రీయ ప్రమాణాలు, ఇంజినీరింగ్ విశ్లేషణలు, నిపుణుల సిఫారసుల ఆధారంగానే ఉంటుందని, ప్రజల భద్రత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఈ శ్రీధర్, టన్నెల్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ కె.శ్రీనివాస్తో పాటు పలువురు సీనియర్ ఇంజినీర్లు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mohan Bhagwat | పాఠ్యపుస్తకాల్లో హిందూ దేవతల సమాచారం ఉండాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
జులై 25, 2026

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
జులై 25, 2026

Abhijeet Dipke | మేం కాక్రోచ్లం.. అంత త్వరగా పోయేవాళ్లం కాదు.. : సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే
జులై 25, 2026
తాజావార్తలు
- ●Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి
- ●Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్
- ●Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే
- ●CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్కూ లింకులు: ఢిల్లీ పోలీసులు
- ●iQOO Z11 Lite | ఐక్యూ జడ్11 లైట్ 5జి వచ్చేసింది.. 6500 ఎంఏహెచ్ బ్యాటరీతో..
- ●Harish Rao | యువతకు ఇది ఒక గొప్ప విజయం.. నిజంగానే దేశంలో మార్పు : హరీశ్రావు

Ponnam PRabhakar | రోజుకు 12 వేల వాటర్ ట్యాంకర్ల డిమాండ్.. ఇదీ హైదరాబాద్ పరిస్థితి

Dharmendra Pradhan Resignation | "ఇది దేశ యువత విజయం.. అహంకారంపై సాధించిన గెలుపు": ప్రధాన్ రాజీనామాపై కాంగ్రెస్

Dasoju Sravan Kumar | జ్ఞాన సమాజం రోడ్డెక్కితే.. ఎంతటి అహంకారమైనా మోకరిల్లాల్సిందే

CJP Protest | ఫేక్ అకౌంట్లతో జంతర్మంతర్ నిరసనపై తప్పుడు ప్రచారం.. పాక్కూ లింకులు: ఢిల్లీ పోలీసులు



