త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPI Narayana | సీఎం రేవంత్‌కు పొంచిఉన్న‌ ప‌ద‌వీ గండం.. ఆ మంత్రి వ‌ల్లేన‌న్న సీపీఐ నారాయణ

CPI Narayana | సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ప‌ద‌వీ గండం పొంచి ఉన్న‌ద‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ (CPI Narayana) అన్నారు. ఆ ముప్పు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనే (Ponguleti Srinivas Reddy) ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు.

G

Telangana | Published On Feb 9, 2026, 10.35 am IST

CPI Narayana | సీఎం రేవంత్‌కు పొంచిఉన్న‌ ప‌ద‌వీ గండం.. ఆ మంత్రి వ‌ల్లేన‌న్న సీపీఐ నారాయణ
Advertisement

CPI Narayana | త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) ప‌ద‌వీ గండం పొంచి ఉన్న‌ద‌ని సీపీఐ సీనియ‌ర్ నేత నారాయ‌ణ (CPI Narayana) అన్నారు. ఆ ముప్పు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనే (Ponguleti Srinivas Reddy) ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలో ఇంటింటికి తిరుగుతూ సీపీఐ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను కోరారు.

ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఉన్న పొత్తులను కాదని కాంగ్రెస్‌ (Congress) ఒంటెత్తు పోకడలకు పాల్పడిందని విమ‌ర్శించారు. ఐదేండ్ల‌ క్రితం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారో తెలుసుకోవాల‌న్నారు. పార్టీలు మారే నాయకులకు ప్రజల్లో గుర్తింపు ఉండద‌ని మండిప‌డ్డారు.

ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట అని చెప్పారు. కమ్యూనిస్టులు తల్లిపాల వంటివార‌ని తెలిపారు. తల్లి పాలకు, డబ్బా పాలకు మధ్య ఈ పోటీ జరుగుతున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా? అని ప్ర‌శ్నించారు. మొత్తం మున్సిపాలిటీలు కాంగ్రెస్‌కే దక్కాలనే రాజకీయ దురుద్దేశంతోనే పొత్తులు కుదరనీయలేదని విమ‌ర్శించారు. సమస్యలు పరిష్కరించే వారికే ఓటేయాలని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement