త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nagi Reddy | విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి టీజీఎస్ఆర్టీసీ సిద్ధం

Nagi Reddy | వేసవి సెలవుల అనంతరం 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు రేపటి (జూన్ 15 సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభం కానున్నాయి. విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ అధికారులను ఆదేశించారు.

S

Telangana | Published On Jun 14, 2026, 3.18 pm IST

Nagi Reddy | విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి టీజీఎస్ఆర్టీసీ సిద్ధం
Advertisement
  • రేపటి నుంచే ప్రత్యేక స్కూల్ బస్సులు
  • విద్యార్థుల వేళలకనుగుణంగా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలి
  • ఆర్టీసీ అధికారుల‌కు ఎండీ వై.నాగిరెడ్డి ఆదేశం

త్రినేత్ర‌.న్యూస్‌: వేసవి సెలవుల అనంతరం 2026-27 విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలు రేపటి (జూన్ 15 సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కలగకుండా అన్ని రూట్లలో తగినన్ని స్కూల్ బస్సులను నడపాలని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అన్ని రీజియన్ అధికారులను ఆదేశించారు. నూతన విద్యాసంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున, విద్యార్థులు సకాలంలో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేశామని చెప్పారు. ​

రాష్ట్రంలోని అన్ని రీజియన్ల అధికారులు, డిపో మేనేజర్లు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి రవాణా ఏర్పాట్లను పర్యవేక్షించాలని సూచించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల స్కూల్ టైమింగ్స్‌కు అనుగుణంగా బస్సు సర్వీసులను క్రమబద్ధీకరించాలని, గతంలో నడిపిన అన్ని స్కూల్ రూట్లను విధిగా పునరుద్ధరించాలన్నారు. విద్యార్థులు బస్సుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ఉదయం మరియు సాయంత్రం వేళల్లో ఖచ్చితమైన సమయ పాలన పాటించాలని, అవసరమైన చోట అదనపు ట్రిప్పులు నడపాలని ఆదేశించారు.

Advertisement
Advertisement