త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్రను దాచేస్తే దాగదని, అమరుల త్యాగాలను నేటి తరానికి తెలియజేయాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

J

Telangana | Published On Sep 16, 2026, 4.05 pm IST

Eatala Rajender | దాచేస్తే దాగేది కాదు తెలంగాణ చరిత్ర

సంక్షిప్త సారాంశం

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో అమరుల త్యాగాల చరిత్రను తెలిపే ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్‌ను ఈటల రాజేందర్, బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే, సెప్టెంబర్ 17, 1948న అనేక త్యాగాల తర్వాత తెలంగాణలో స్వేచ్ఛా పవనాలు వీచాయని గుర్తుచేశారు. నిజాం కాలంలోని అరాచకాలు, రజాకార్ల దురాగతాలు, పోరాట యోధులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు చదువుతో పాటు దేశభక్తిని, చారిత్రక స్పృహను నూరిపోయాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

Advertisement
  • సికింద్రాబాద్ వేదికగా ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Eatala Rajender | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను, నాటి చారిత్రక నేపథ్యాన్ని భావితరాలకు తెలియజేసేలా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన "ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్" అత్యంత ఘనంగా ప్రారంభమైంది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావులతో కలిసి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు.

Telangana History Cannot Be Hidden says Eatala Rajender

చరిత్రను భావితరాలకు అందించాలి

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ చరిత్రను ఎవరూ దాచలేరని, త్యాగాలతో కూడిన ఆ చారిత్రక సత్యాలను నేటి యువతకు అందించడమే మన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశమంతా ఆగస్టు 15, 1947 నాడే స్వాతంత్య్రం పొందితే, తెలంగాణలో మాత్రం ఎన్నో ప్రాణత్యాగాల అనంతరం సెప్టెంబర్ 17, 1948 రోజున విముక్తి లభించిందని గుర్తుచేశారు. మనం నేడు అనుభవిస్తున్న స్వేచ్ఛ ఊరికే రాలేదని, లక్షలాది మంది భరతమాత ముద్దుబిడ్డల ప్రాణ త్యాగాల ఫలితమే ఇదని ఉద్ఘాటించారు.

Telangana History Cannot Be Hidden says Eatala Rajender

నిజాం కాలం నాటి అరాచకాలు.. పోరాట స్ఫూర్తి

నిజాం పాలనలో, రజాకార్ల కాలంలో ప్రజలు పడిన నష్టాలను ఈటల ఈ సందర్భంగా గుర్తుచేశారు. వందేమాతరం అన్నా, మూడు రంగుల జెండా ఎత్తినా జైళ్లలో పెట్టేవారని, పరకాలలో జెండా ఎత్తినందుకు 26 మందిని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాశిం రజ్వీ అరాచకాలు, దాశరథి కవిత్వం, నిర్మల్ ప్రాంతంలో రాంజీ గోండు ఆధ్వర్యంలో జరిగిన పోరాటాలను, కొమరం భీమ్ త్యాగాలను స్మరించుకున్నారు.

Telangana History Cannot Be Hidden says Eatala Rajender

చరిత్ర లేకుండా వర్తమానం లేదని, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పిల్లలకు కేవలం చదువు, ఉద్యోగాలే కాకుండా దేశభక్తిని కూడా నూరిపోయాలని పిలుపునిచ్చారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ గుండెల్లో దాచుకోవాలని కోరారు.

Telangana History Cannot Be Hidden says Eatala Rajender Telangana History Cannot Be Hidden says Eatala Rajender Telangana History Cannot Be Hidden says Eatala Rajender

Advertisement
Advertisement