త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sharada Peetham | శార‌దా పీఠం భూముల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం

Sharada Peetham | కోకాపేట‌లో శార‌దా పీఠం భూముల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ భూముల‌ను శార‌దా పీఠానికే కొన‌సాగించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

S

Telangana | Published On Feb 28, 2026, 7.09 pm IST

Sharada Peetham | శార‌దా పీఠం భూముల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం
Advertisement

కోకాపేట‌ భూములు పీఠానికే
జ‌ల‌మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు
స‌రైన స‌మాచారం ఇవ్వ‌లేద‌ని సీఎం ఆగ్ర‌హం

Sharada Peetham | త్రినేత్ర‌.న్యూస్ : కోకాపేట‌లో శార‌దా పీఠం భూముల‌పై తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ భూముల‌ను శార‌దా పీఠానికే కొన‌సాగించాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పీఠం భూములు జ‌లమండ‌లికి కేటాయించిన నేప‌థ్యంలో అక్క‌డ సాగుతున్న నిర్మాణ ప‌నుల విష‌యాల‌ను పీఠం ప్ర‌తినిధులు ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకువ‌చ్చారు.

ఈ అంశంపై రాష్ట్ర స‌చివాల‌యంలో సీఎం రేవంత్ ఉన్న‌తాధికారుల‌తో శ‌నివారం సాయంత్రం స‌మావేశ‌మ‌య్యారు. కోకాపేట భూముల్లో పీఠం ఆధ్వ‌ర్యంలో వివిధ నిర్మాణాల తాజా స్థితిని ముఖ్య‌మంత్రి తెలుసుకున్నారు. పీఠం భూముల‌ను జ‌ల‌మండ‌లికి కేటాయించే స‌మ‌యంలో నిర్మాణాల స్థితిని తెలియ‌జేయ‌క‌పోవ‌డంపై ముఖ్య‌మంత్రి మండిప‌డ్డారు. జ‌ల మండ‌లికి కేటాయింపులు ర‌ద్దు చేసి పీఠానికే ఆ భూములు కొన‌సాగించాల‌ని ఆదేశించారు. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబును క‌లిసి నిర్మాణాలు, ఇత‌ర ప‌రిస్థితుల‌ను వివ‌రించాల‌ని ముఖ్య‌మంత్రి, పీఠం ప్ర‌తినిధుల‌కు సూచించారు.

Advertisement
Advertisement