త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Contractors | సంక్షోభంలో తెలంగాణ కాంట్రాక్ట‌ర్లు.. రేవంత్ స‌ర్కార్ రూ. 20 వేల కోట్ల బాకీ

Telangana Contractors | తెలంగాణ‌లోని చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కాంట్రాక్ట‌ర్లు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నార‌ని బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్ట‌ర్ తెలిపింది. ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్, నీటిపారుద‌ల‌, గిరిజ‌న సంక్షేమం, ఇత‌ర శాఖలు తెలంగాణ కాంట్రాక్ట‌ర్ల‌కు రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని పేర్కొంది.

S

Telangana | Published On Jun 3, 2026, 5.33 pm IST

Telangana Contractors | సంక్షోభంలో తెలంగాణ కాంట్రాక్ట‌ర్లు.. రేవంత్ స‌ర్కార్ రూ. 20 వేల కోట్ల బాకీ
Advertisement

Telangana Contractors | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ‌లోని చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా కాంట్రాక్ట‌ర్లు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నార‌ని బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్ట‌ర్ తెలిపింది. ఆర్ అండ్ బీ, పంచాయ‌తీరాజ్, నీటిపారుద‌ల‌, గిరిజ‌న సంక్షేమం, ఇత‌ర శాఖలు తెలంగాణ కాంట్రాక్ట‌ర్ల‌కు రూ. 20 వేల కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని పేర్కొంది. ప్ర‌తి బిల్లు ధృవీక‌రించి, టోకెన్ నంబ‌ర్లు జారీ చేయ‌బ‌డ్డాయి.. కానీ ప్ర‌భుత్వం మాత్రం నిధులు చెల్లించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు బాధిత కాంట్రాక్ట‌ర్లు సిద్ధ‌మ‌య్యారు. ఈ నెల 18న హైద‌రాబాద్ న‌గ‌రంలో మ‌హాస‌భ‌కు సిద్ధ‌మ‌య్యారు. పెద్ద గోల్కొండ‌లోని మంత్ర క‌న్వెన్ష‌న్‌లో మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మ‌హాస‌భ నిర్వ‌హించ‌నున్నారు.

బిల్లుల విడుద‌ల కోసం గ‌త మూడేండ్ల నుంచి డివిజ‌న‌ల్ ఇంజినీర్లు, చీఫ్ ఇంజినీర్లు, ఆర్థిక శాఖ‌, ఆర్థిక మంత్రి, ముఖ్య‌కార్య‌ద‌ర్శి, ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి ఎన్ని లేఖ‌లు రాసినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని పేర్కొంది. 2024, జ‌న‌వ‌రి నెల‌లో బిల్డ‌ర్స్ క‌న్వెన్ష‌న్‌లో 2 నుంచి 3 నెల‌ల్లో అన్ని బకాయిలు చెల్లిస్తామ‌ని హామీ ఇచ్చిన‌ప్ప‌టికీ.. ఆ హామీ కూడా నెర‌వేర‌లేద‌ని గుర్తు చేసింది.

ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం కార‌ణంగా చిన్న కాంట్రాక్ట‌ర్లు రోడ్డున ప‌డ్డారు. ప‌నులు చేయించుకునేందుకు బ్యాంకుల వ‌ద్ద రుణాలు తీసుకున్నారు. తిరిగి చెల్లిద్దామంటే ప్ర‌భుత్వం బిల్లులు చెల్లించ‌డం లేదు. దీంతో కాంట్రాక్ట‌ర్ల‌కు భారీగా క్రెడిట్ రేట్ త‌గ్గింది.. ఇప్ప‌టికే చాలా కంపెనీలు ఎన్‌పీగా ప్ర‌క‌టించ‌బ‌డ్డాయి.. కొన్ని మూత‌ప‌డ్డాయ‌ని బిల్డ‌ర్స్ అసోసియేష‌న్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఈ క్ర‌మంలో కొన్ని వేల మంది ఉపాధి కోల్పోయారు. కొంత‌మంది కాంట్రాక్ట‌ర్ల‌కు గుండెపోట్లు సంభ‌వించాయి. కొంద‌రు ప్రాణాలు తీసుకున్నారు. అప్పులు భ‌రించ‌లేక ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కాబ‌ట్టి త‌క్ష‌ణ‌మే అన్ని బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని బీఐఏ డిమాండ్ చేసింది.

Advertisement
Advertisement