త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్

ADG Vijay Kumar | తెలంగాణలో చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ (PSARA) లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అథారిటీ నియంత్రణాధికారి విజయ్ కుమార్ హెచ్చరించారు.

P

Telangana | Published On Jun 17, 2026, 9.15 pm IST

ADG Vijay Kumar | లైసెన్స్ లేని సెక్యూరిటీ ఏజెన్సీలపై కఠిన చర్యలు: ఏడీజీ విజయ్ కుమార్
Advertisement

ADG Vijay Kumar | తెలంగాణలో చెల్లుబాటు అయ్యే పీఎస్‌ఏఆర్‌ఏ (PSARA) లైసెన్స్ లేకుండా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ అథారిటీ నియంత్రణాధికారి విజయ్ కుమార్ హెచ్చరించారు. లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల యజమానులు, అసోసియేషన్ ప్రతినిధులు, ఇంటెలిజెన్స్ మరియు కార్మిక శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పీఎస్‌ఏఆర్‌ఏ-2005 చట్టం, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి సెక్యూరిటీ ఏజెన్సీకి లైసెన్స్ తప్పనిసర‌ని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సెక్యూరిటీ గార్డుల నియామకంలో పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరిగా నిర్వహించాలని, 21 రోజుల ప్రాథమిక శిక్షణ పూర్తిచేసిన వారినే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇటీవల కొందరు సెక్యూరిటీ సిబ్బంది నేరాల్లో పాల్గొన్న ఘటనల నేపథ్యంలో ఈ సూచనలు చేసినట్లు తెలిపారు. గార్డులకు ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాలు, ఈఎస్‌ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని, కార్మిక నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులు సూచించారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది స్థానిక పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని విజయ్ కుమార్ కోరారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు లైసెన్సింగ్, పునరుద్ధరణ, ఆన్‌లైన్ పోర్టల్ తదితర అంశాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించగా, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. చట్టబద్ధంగా పనిచేసే సెక్యూరిటీ ఏజెన్సీలకు ప్రభుత్వ శాఖల నుంచి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు.

Advertisement
Advertisement